ETV Bharat / crime

TOLLYWOOD DRUGS CASE: సుమారు 7 గంటల పాటు తనీష్‌ను విచారించిన ఈడీ

author img

By

Published : Sep 17, 2021, 5:41 PM IST

Updated : Sep 17, 2021, 7:16 PM IST

Tollywood drugs case
Tollywood drugs case

17:39 September 17

బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై తనీష్‌ను ప్రశ్నించిన ఈడీ

టాలీవుడ్​లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టి ఈడీ విచారణకు నటుడు తనీష్​ హాజరయ్యారు. మనీలాండరింగ్​ వ్యవహారంలో సుమారు 7 గంటలపాటు తనీష్​ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ప్రశ్నించారు. తనను మళ్లీ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదన్న నటుడు తనీష్.. విచారణకు రమ్మంటే మళ్లీ వస్తానన్నారు.  

మనీలాండరింగ్​ వ్యవహారంలో ఇప్పటికే టాలీవుడ్​కు చెందిన పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ, నవదీప్​తో పాటు డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్ సింగ్​, ముమైత్​ఖాన్​ను.. ఇప్పటికే ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు ప్రశ్నించారు.

కెల్విన్‌కు సమన్లు..

మాదక ద్రవ్యాల విక్రేత కెల్విన్​కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో కెల్విన్​పై బాలానగర్ ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్​ను ఇటీవల విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. డిసెంబరు 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  

కెల్విన్​పై 2017లో ఆబ్కారీ శాఖ కేసు నమోదు చేసింది. అనంతరం కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా పలువురు సినీనటులను ఆబ్కారీ శాఖ విచారించింది. కెల్విన్​తో పాటు నిఖిల్ శెట్టి అలియాస్ నిశ్చయ్, రవికిరణ్​పై ఎక్సైజ్ అధికారులు జనవరిలో ఛార్జిషీట్​ దాఖలు చేశారు. కొవిడ్ పరిస్థితుల కారణంగా కేసు విచారణ ప్రక్రియ ముందుకు సాగలేదు.   

ఇదీచూడండి: 

Last Updated :Sep 17, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.