ETV Bharat / bharat

కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనీయం: టికాయిత్​

author img

By

Published : Feb 14, 2021, 8:53 PM IST

సాగు చట్టాలను రద్దు చేసేవరకు ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చోనీయబోమని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​ తెలిపారు. పెద్ద కార్పొరేటర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. ఆకలిపై వ్యాపారం చేస్తే ఈ దేశం అనుమతించదని చెప్పారు.

rakesh tikait about goverment peace
'అప్పటివరకు ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనీయం'

రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చోనివ్వబోమని భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ)​ నేత రాకేశ్​ టికాయిత్​ పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న తమ ఆందోళనకు మద్దతు కూడగట్టేందుకు.. 40 మంది రైతు నాయకులు.. దేశ వ్యాప్తంగా తిరుగుతారని తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని టికాయిత్​ అన్నారు. హరియాణాలోని కర్నల్​ జిల్లా ఇంద్రి గ్రెయిన్​ మార్కెట్​ వద్ద నిర్వహించిన మహాపంచాయత్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

"కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలు.. ప్రజా పంపిణీ వ్యవస్థను అంతం చేస్తాయి. వీటి వల్ల రైతులు మాత్రమే కాకుండా చిరు వర్తకులు, రోజూ కూలీలు ఇతర రంగాల వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గోదాంలను ముందు నిర్మించారు. ఆ తర్వాత చట్టాలను తీసుకువచ్చారు.పెద్ద కార్పొరేటర్ల కోసమే ఈ చట్టాలను తెచ్చారని రైతులు ఆ మాత్రం పసిగట్టలేరా? ఆకలిపై వ్యాపారం చేయడానికి ఈ దేశంలో అనమతి లేదు."

--రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

రైతు సంఘాల నాయకులు, వేదికలు మారవని టికాయిత్ పునరుద్ఘాటించారు. టికాయిత్​తో పాటు, బల్బీర్​ సింగ్ రాజేవాల్​, దర్శన్​ పాల్​, హరియాణా బీకేయూ చీఫ్​ గుర్నామ్​ సింగ్​ చదౌనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రూ. లక్షన్నర కరెంట్​ బిల్లు.. రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.