పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసిన అమెరికన్ రెస్టారెంట్ ఔట్లెట్పై.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ మహిళ కోటి రూపాయల పరిహారానికి కేసు వేసింది! ఈ మేరకు ఆమె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
గాజియాబాద్కు చెందిన దీపాళీ త్యాగి 2019, మార్చి 21న సదరు ఔట్లెట్ నుంచి శాకాహారం పిజ్జాను ఆర్డర్ చేసింది. అయితే.. "చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. మాంసాహార పిజ్జాన ఇవ్వడం వల్ల రుచి చూశాక బిత్తరపోయాం. దాన్ని తినడం వల్ల మా మతపర మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహారం పూజల నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే.. సదరు ఔట్లెట్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు." అని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
వీటికి సమాధానం కోరుతూ దిల్లీకి చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు ఔట్లెట్కు నోటీసులు జారి చేసింది.
ఇదీ చూడండి:పెళ్లి విందుకు చేసే రోటీలపై ఉమ్మిన యువకుడు