ETV Bharat / bharat

ఎన్నికల తరువాత తొలిసారి మోదీ, మమతల సమావేశం

author img

By

Published : May 28, 2021, 5:04 AM IST

మమత, ప్రధాని నరేంద్రమోదీ

బంగాల్​ ఎన్నికల తరువాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలవనున్నారు. ఇటీవల కల్లోలం సృష్టించిన యాస్​ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ,మమతలు కలసి పర్యటించనున్నారు.

బంగాల్​ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇటీవల యాస్​ తుపాను మిగిల్చిన వినాశనాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమ మేదినీపుర్ జిల్లాలోని కలైకుండలో శుక్రవారం సమావేశం జరుగుతుందని మమత తెలిపారు. మోదీ, మమత, బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ కలసి తుపాను ప్రభావిత ప్రాంతాలైన పుర్బా, మేదినిపుర్​, దక్షిణ,ఉత్తర 24 పరగణాలలో ఏరియల్​ సర్వే చేపట్టనున్నారు.

"యాస్​ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేపట్టనున్నారు. మొదటగా దిఘాలో ఏరియల్​ సర్వే నిర్వహించనున్నారు. ఆ తరువాత కలైకుండలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. "

-మమత బెనర్జీ, బంగాల్​ సీఎం

ఒడిశా పర్యటన..

బంగాల్​ పర్యటన కంటే ముందుగా ప్రధాని ఒడిశాలో పర్యటించనున్నారు. యాస్​ తుపాను సృష్టించిన కల్లోలాన్ని ఏరియల్​ సర్వే ద్వారా వీక్షించనున్నారు. అనంతరం బంగాల్​ చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు పయనమవుతారు .

ఇదీ చూడండి: 50 ఏళ్లలో 117 తుపాన్లు.. 88 శాతం తగ్గిన ప్రాణనష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.