ETV Bharat / bharat

Modi Birthday Celebration: 71 అడుగుల కేక్​.. 71 కిలోల లడ్డూ

author img

By

Published : Sep 17, 2021, 9:44 AM IST

Updated : Sep 17, 2021, 1:15 PM IST

modi birthday
71 అడుగుల కేక్​.. 71 కిలోల లడ్డూతో వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు (Modi Birthday Celebration) వేడుకలను ఘనంగా నిర్వహించారు భాజపా కార్యకర్తలు. మధ్యప్రదేశ్​లో 71 అడుగుల భారీ కేక్​ను కట్​ చేయగా.. వారణాసిలో 71 కిలోల లడ్డూను తయారు చేయించారు. ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​.. ప్రధాని మోదీకి (PM Modi News)శుభాకాంక్షలు తెలుపుతూ​ పూరీ బీచ్​లో సైకత శిల్పాన్ని రూపొందించారు.

ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (Modi Birthday Celebration) సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోదీ 71వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో కార్యకర్తలు.. 71 అడుగుల కేక్​ను తయారు చేయించారు. వ్యాక్సిన్​ రూపంలో ఉన్న ఈ భారీ కేక్​ను ప్రధాని మోదీకి అంకితం ఇస్తూ టీకా పంపిణీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

"ఈ రోజు ప్రజాసేవకు ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాము. మోదీ పుట్టినరోజు సందర్భంగా మొత్తం 71 మంది రక్తదానం చేశారు. 71 అడుగుల కేక్​ను కూడా కట్​ చేశాము. ప్రధాని.. ఇలాగే ప్రజాసేవ కొనసాగించాలని ఆశిస్తున్నాము."

-భాజపా కార్యకర్త

ఇందోర్​లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయ్​వర్గీయ.. దివ్యాంగ చిన్నారుల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో కలిసి పాటలు పాడారు.

71 కేజీల లడ్డూ..

modi birthday
వారణాసిలో వేడుకలు
modi birthday
71 కిలోల లడ్డూ

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలో దీపాలు వెలిగించి.. మోదీ పుట్టినరోజు వేడుకలను (Modi Birthday News) నిర్వహించారు కార్యకర్తలు. ఈ సందర్భంగా 71 కిలోల లడ్డూను కోసి సంబరాలు (Modi Birthday Celebration) చేసుకున్నారు. భాజపా ఎంపీ రూపా గంగూలీ, బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం మాజీ వైస్​ ఛాన్సలర్​ జీసీ త్రిపాఠి ఆధ్వర్యంలో 'కాశీ సంకల్ప్​' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సైకత శిల్పం..

modi birthday
సుదర్శన్​ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం

ప్రధాని మోదీకి అంకితం చేస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్.. పూరీ బీచ్​లో సైకత శిల్పాన్ని రూపొందించారు.

ధాన్యాలతో చిత్రపటం..

modi birthday
ధాన్యాలతో రూపొందించిన మోదీ చిత్రపటం
modi birthday
మోదీ చిత్రపటంతో ప్రియాంక

ఒడిశాకు చెందిన ప్రియాంక సహానీ అనే యువతి ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవు ఉన్న ప్రధాని మోదీ ఆకృతిని రూపొందించింది. మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా దీనిని ఆయనకు అంకితం చేస్తున్నట్లు పేర్కొంది. భారత్​.. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే దేశం కావడం వల్ల ఈ చిత్రాన్ని ధాన్యాలతో తయారు చేసినట్లు ప్రియాంక వెల్లడించింది. ఇది ఒడిశా సంప్రదాయ కళ అయిన పట్టచిత్రను ప్రతిబింబిస్తుందని తెలిపింది.

వ్యాక్సినేషన్​ రికార్డ్​ లక్ష్యంగా..

నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా (Modi Birthday News) దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా టీకాలను పంపిణీ (Vaccination in India) చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి : Mizoram covid: 'వారిలో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు'

Last Updated :Sep 17, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.