ETV Bharat / bharat

కరోనా విజృంభణతో చార్​ధామ్​ యాత్ర వాయిదా

author img

By

Published : Apr 29, 2021, 11:57 AM IST

Updated : Apr 29, 2021, 4:48 PM IST

Char Dham Yatra
చార్​ధామ్​ యాత్ర

11:55 April 29

కరోనా విజృంభణతో చార్​ధామ్​ యాత్ర వాయిదా

హిమాలయాల్లోని ప్రఖ్యాత దైవక్షేత్రాలను దర్శించుకునేందుకు నిర్వహించే చార్​ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.  

మే 17వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. రోజురోజుకు కేసులు పెరుగుతున్న వేళ చార్​ధామ్ యాత్ర నిర్వహించడం ఈ ఏడాది కుదరదని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ పేర్కొన్నారు. ఈ ఆలయాలు మాత్రం తెరిచే ఉంటాయని చెప్పారు. భక్తులకు అనుమతి ఉండదని, పూజారులే రోజువారి కార్యక్రమాలు చేపడతారని స్పష్టం చేశారు.  

బద్రీనాథ్, కేదార్​నాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను చార్​ధామ్​గా వ్యవహరిస్తారు.  

Last Updated :Apr 29, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.