ETV Bharat / bharat

యూపీ ఐదో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం.. బరిలో 692 మంది

author img

By

Published : Feb 26, 2022, 5:18 PM IST

UP polls 2022
యూపీ ఐదో విడత పోలింగ్​

UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఆదివారం ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

UP polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఐదో విడత పోలింగ్​కు సర్వం సన్నద్ధమైంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఆదివారమే ఓటింగ్​ జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ కొనసాగనుంది. దాదాపు 2 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • ఎన్నికలు జరిగే స్థానాలు: 61
  • బరిలో నిలిచిన అభ్యర్థులు: 692

ఎన్నికలు జరగనున్న జిల్లాలు: సుల్తాన్‌పుర్, చిత్రకూట్‌, ప్రతాప్‌గఢ్‌, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రయిచ్‌, శ్రావస్తి, గోండా జిల్లాల్లో ఈ దశలో పోలింగ్ జరగనుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే అమేఠీ, రాయ్‌బరేలీ, రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఆదివారమే ఓటింగ్​.

బరిలో ప్రముఖులు: ఈ విడత బరిలో యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్య.. సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయనపై అప్నాదళ్​​ నేత పల్లవి పటేల్​ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సిద్ధార్థ నాథ్​ సింగ్ ​(అలహాబాద్​ పశ్చిమం), రాజేంద్ర సింగ్​(ప్రతాప్​గఢ్​), నంద గోపాల్​ గుప్తా నాడి (అలహాబాద్​ దక్షిణం), రమాపతి శాస్త్రి (మంకాపుర్​), 1993 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న రఘురాజ్​ ప్రతాప్​ సింగ్​ మరోమారు కుండా నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు.. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత ఆరాధన మిశ్రా పోటీలో ఉన్నారు.

ఫలితాలు: 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఆదివారం జరగనున్న పోలింగ్‌తో మొత్తం 292 స్థానాలకు ఓటింగ్‌ పూర్తి కానుంది. మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: భాజపా కార్యకర్త దాడిలో దళిత యువకుడు మృతి- రాముని గుడి​ ముందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.