భాజపా కార్యకర్త దాడిలో దళిత యువకుడు మృతి- రాముని గుడి​ ముందే!

By

Published : Feb 26, 2022, 2:22 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

రామ్​మందిర్​ ఎదుటే దళిత యువకుడిపై దాడి చేశాడు ఓ భాజపా కార్యకర్త. దీంతో గాయాలకు తట్టుకోలేక మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయాడు బాధితుడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. ధర్మస్థలి గ్రామానికి చెందిన నిందితుడు కృష్ణ.. భజరంగ్​దళ్​ కార్యకర్త కూడా. ఈ నెల 23న కన్యాడిలోని రామ ​మందిరం​ ఎదుట దినేశ్​ అనే ఎస్సీ యువకుడిపై ఏదో వివాదం కారణంగా దాడి చేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా దినేశ్​ను ఆస్పత్రిలో చూపించాలని కృష్ణను కోరింది అతని తల్లి. దీంతో మరుసటి రోజు ఉదయం తన నేరాన్ని కప్పిపుచ్చి, ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరిపించాడు కృష్ణా. అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన దినేశ్​.. ఆస్పత్రిలో చేరిన రోజే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను మాజీ సీఎం సిద్ధరామయ్య ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కృష్ణను అరెస్టు చేసిన పోలీసులు, బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తామని చెప్పారు.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.