ETV Bharat / bharat

'ఆసుపత్రికి వెళ్లా- ప్రియుడితో పారిపోలేదు'.. మహిళ హైడ్రామా.. మాజీ భర్తతో వాగ్వాదం!

author img

By

Published : Jul 5, 2022, 11:10 AM IST

Updated : Jul 5, 2022, 11:37 AM IST

ప్రియుడి మోజులో భర్తను వదిలేసి వెళ్లిపోయిన మహిళ.. తన పిల్లల కోసం తిరిగి వచ్చింది. అయితే, తాను ప్రియుడితో పారిపోలేదని మహిళ చెబుతోంది. ఈ క్రమంలో పిల్లల విషయమై భర్తతో వాగ్వాదానికి దిగింది.

Ujjain Mother Eloped With Lover
ప్రియుడితో పారిపోయిన భార్య

ప్రియుడి మోజులో భర్తకు విడాకులు ఇచ్చి, పిల్లల్నీ వదిలేసి పారిపోయిన మహిళ.. తిరిగొచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్లానంటూ చెప్పుకొచ్చింది. పిల్లల కోసం తిరిగి వచ్చినట్లు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే...
మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో ఉండే ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను ఇంట్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది. ఆ పసివాళ్లను స్థానికులు చేరదీశారు. అయితే, తన బిడ్డలను తీసుకెళ్లేందుకు సోమవారం ఇంటికి వచ్చింది ఆ మహిళ. తనకి ఆరోగ్యం బాగోలేక ఉత్తర్​ప్రదేశ్​లోని ఆసుపత్రికి తన ప్రియుడు అభిషేక్​ మౌర్యతో కలిసి వెళ్లానని చెప్పింది. పిల్లలను తాను ఆస్పత్రిలోనే తన మాజీ భర్త అనిల్​కు అప్పగించానని తెలిపింది. జాగ్రత్తగా చూసుకోమ్మని చెప్పినా.. అతడు ఇద్దరు బిడ్జలను రోడ్డు మీద వదిలేశాడని ఆరోపించింది.

మాజీ భర్తతో వాగ్వాదం
ఈ క్రమంలోనే మాజీ భార్యాభర్తల సోమవారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పిల్లల బాధ్యతలను స్వీకరించే విషయంపై ఇరువురు ఘర్షణ పడ్డారు. రోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. పిల్లల బాధ్యతను ఇద్దరం పంచుకోవాలని మహిళ తన మాజీ భర్తకు ప్రతిపాదించింది. అయితే, మహిళ మాజీ భర్త అనిల్ గుప్తా.. పిల్లల గురించి తనకేమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు.

"నా భార్యకు ఇంతకుముందు పెళ్లి అయింది. ఆమెకు అప్పటికే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అనంతరం నేను వివాహం చేసుకున్నా. మా ఇద్దరికి ఒక కుమార్తె జన్మించింది. ఆ తర్వాత నుంచి అభిషేక్‌ అనే వ్యక్తితో నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చేశాను. వారం రోజుల క్రితం పిల్లలిద్దరినీ నా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది."
-అనిల్ గుప్తా, పిల్లల తండ్రి

ఇదీ జరిగింది:
దేశాయ్ నగర్​లో మహిళ తన ప్రియుడు అభిషేక్​ మౌర్య, ఇద్దరు పిల్లలతో కలిసి నాలుగు నెలలుగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే జూన్ 26న ఒక్కసారిగా అనారోగ్యం బారినపడింది ఆ మహిళ. "ఆస్పత్రిలో చేరడానికి వెళ్తున్నా.. పెదనాన్న మిమ్మల్ని చూడటానికి వస్తారు" అని పిల్లలకు చెప్పి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగిరాలేదు. దీంతో ఆ రోజు సాయంత్రం పిల్లలు.. తల్లి కోసం వీధుల్లో తిరగడాన్ని గుర్తించిన స్థానికులు వారిని చేరదీశారు. ఈ విషయాన్ని వారి తండ్రి అనిల్ గుప్తాకు తెలియజేయగా.. పిల్లలను తనతో ఉంచుకునేందుకు ఆయన సుముఖంగా లేరని స్థానికులు చెప్పారు. ఇక ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా.. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండి ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదని తెలుస్తోంది.

సామాజిక మాధ్యమాల ద్వారా మౌర్యతో సదరు మహిళకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు భర్త అనిల్ గుప్తా. అనంతరం ఆమె.. పిల్లలు (ఐదేళ్ల బాబు లక్షిత్, రెండేళ్ల పాప రియా), ప్రియుడితో కలిసి నివసించేది. అయినప్పటికీ అప్పుడప్పుడూ వచ్చి ఆ పిల్లలను తండ్రి చూసిపోతుండేవాడని సమాచారం.

ఇవీ చదవండి: పొట్టేళ్లతో వ్యవసాయం.. నాగలితో దున్నడం, బండిని లాగడం అన్నీ వాటితోనే!

'రబ్బర్​ స్టాంపుగా మారనని ప్రమాణం చేయండి​'.. ముర్ముకు సిన్హా సవాల్​

Last Updated : Jul 5, 2022, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.