ETV Bharat / bharat

లారీ టైర్​ పేలి.. కారు, బైక్​పై వెళ్తున్న 9 మంది మృతి

author img

By

Published : May 4, 2023, 4:08 PM IST

Updated : May 4, 2023, 5:32 PM IST

టైరు పేలడం వల్ల ఓ భారీ ట్యాంకర్​తో కూడిన లారీ.. కారు, బైక్​పైకి దూసుకెళ్లింది. రాజస్థాన్​లోని జయ్​పుర్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించారు.

tyre burst accident
tyre burst accident

ఓ భారీ ట్యాంకర్ లారీ టైరు పేలడం.. 9 మంది మృతికి కారణమైంది. రాజస్థాన్​ జయ్​పుర్ జిల్లా రామ్​నగర్​ సమీపంలో గురువారం జరిగిందీ ఘోర ప్రమాదం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

క్షణాల్లో పెను బీభత్సం..
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జైపుర్​- అజ్మేర్​ రహదారిపై రామ్​నగర్​ ప్రాంతంలో ఓ భారీ ట్యాంకర్​తో కూడిన లారీ ప్రయాణిస్తోంది. గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో లారీ టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఫలితంగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగంగా దూసుకెళ్లిన ట్యాంకర్.. ఓ బైక్​ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. ఏం జరిగిందో అని తెలుసుకునేలోపే కారు, బైక్​పై ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

tyre burst accident
బోల్తా పడిన లారీ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్​ కింద నలిగిపోయిన కారులో చిక్కుకుపోయిన మృదేహాలను చాలా సేపు శ్రమించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అయిపోయాక మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. కారులోని వారంతా తీర్థయాత్ర కోసం ఫాగి నుంచి అజ్మేర్​కు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ట్విట్టర్​ వేదికగా చెప్పారు. ఈ ప్రమాదం చాలా బాధాకరమని రాజస్థాన్​ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్​ ట్విట్​ చేశారు. .

బస్సు కారు ఢీ.. నలుగురు మృతి..
రాంగ్​ రూట్​​లో వచ్చిన ఓ ప్రైవేటు బస్సు.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. గురువారం మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఓ వ్యక్తి గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విటా-నవేరి-మహబలేశ్వర్​ రహదారిపై ఓ బస్సు.. విటా నుంచి నవేరి వెళ్తోంది. సాంగ్లీ జిల్లా కేంద్రానికి 60 కిలీమీటర్ల దూరంలో.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న సదానంద్​ కషీద్​ గాయాలయ్యాయి. మృతులను ముంబయికు చెందిన యోగేశ్​ కాదం(35), సునీతా సదానంద్​ కషీద్​ (61), అశోక్​ సూర్యవంశీ (64)గా గుర్తించారు. బస్సు డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆటోను ఢీకొట్టిన ఆర్​టీసీ బస్సు.. ఆరుగురు మృతి..
తమిళనాడు ఈస్ట్​ కోస్ట్​ రహదారిపై పుదుచ్చేరి వెళ్తున్న ఆర్​టీసీ బస్సు.. ఓ ఆటోను ఢీకొట్టింది. కాంచీపురం జిల్లా మామల్లాపురం ప్రాంతంలోని మనమై గ్రామంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారని పోలీసులు తెలిపారు.

Last Updated :May 4, 2023, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.