ETV Bharat / bharat

టీఎంసీ నేతల దారుణ హత్య.. రక్తపు మడుగులో ముగ్గురు!

author img

By

Published : Jul 7, 2022, 8:08 PM IST

Trinamool leaders shot dead in West Bengal's Canning
Trinamool leaders shot dead in West Bengal's Canning

Trinamool Leaders Shot Dead: ముగ్గురు తృణమూల్​ కాంగ్రెస్​ నాయకుల్ని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన బంగాల్​ గోపాల్​పుర్​ సమీపంలోని ధర్మతలా గ్రామంలో జరిగింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు.

Trinamool Leaders Shot Dead: బంగాల్​లో దారుణం జరిగింది. ముగ్గురు తృణమూల్​ కాంగ్రెస్​ నాయకుల్ని హత్య చేశారు దుండగులు. దక్షిణ 24 పరగణాలు జిల్లా గోపాల్​పుర్​ గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మృతుల్ని ధర్మతలా గ్రామ పంచాయతీ సభ్యులు స్వపన్​ మాఝీ(38), భూత్​నాథ్​ ప్రామాణిక్​(33), ఝాంతు హల్దార్​గా (33) గుర్తించారు.

ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి షాకయ్యారు. పియర్​ పార్క్ రోడ్డు​ సమీపంలో హత్య చేసి దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వెల్లడించారు. బైక్​లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలంలో బాంబ్​ షెల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల వెనుక భాజపా ఉందని ఆరోపించారు స్థానిక తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే పరేశ్​ రామ్​ దాస్​.

ఇవీ చూడండి: ప్రొఫెసర్ 'గాంధీగిరి'​.. రూ.24లక్షల జీతం వాపస్.. అదే కారణం!

'కాళీమాత'పై ఎంపీ కామెంట్స్​.. దీదీ కీలక వ్యాఖ్యలు.. 'తప్పు చేశారు కానీ..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.