ETV Bharat / bharat

'టూల్​కిట్​' కేసులో నికితకు ముందస్తు బెయిల్​

author img

By

Published : Feb 17, 2021, 3:44 PM IST

దిల్లీ రైతు ఉద్యమానికి సంబంధించిన టూల్​కిట్​ కేసులో నిందితురాలైన న్యాయవాది నికితా జాకబ్​కు తాత్కాలిక ఊరట కల్పించింది బాంబే హైకోర్టు. మూడు వారాలకు మందస్తు బెయిల్​ మంజూరు చేసింది.

Suspect Nikita Jacob gets transit pre-arrest bail
టూల్​కిట్​ కేసులో నికితకు ముందస్తు బెయిల్​

టూల్​కిట్​ కేసులో న్యాయవాది నికితా జాకబ్​కు బాంబే హైకోర్టు ట్రాన్సిట్​ ఆంటిసిపేటరీ (ముందస్తు) బెయిల్​ను మంజూరు చేసింది. ముంబయి వాసి అయిన నికితపై దిల్లీలో ఎఫ్​ఐఆర్​ నమోదైన నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించేందుకు మూడు వారాల సమయం ఇచ్చింది. ఇది నికితకు తాత్కాలిక ఊరట మాత్రమేనని.. నిర్దిష్ట గడువులోగా దిల్లీ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.

"ఏ సమయంలోనైనా తనను అరెస్ట్​ చేస్తారని దరఖాస్తుదారు(నికిత) భయాందోళనకు గురవుతున్నారు. వేరే రాష్ట్రంలోని కోర్టు నుంచి ఊరట పొందేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. అందువల్ల ఆమె అభ్యర్థన మేరకు రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్​ మంజూరు చేయవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది."

- జస్టిస్​ పీడీ నాయక్​, బాంబే హైకోర్టు

ఇవీ చదవండి:

అరెస్ట్​ చేస్తే..

మూడు వారాల వ్యవధిలో జాకబ్​ను అరెస్ట్​ చేస్తే.. రూ.25వేల బాండ్​ ఇచ్చాక ఆమెను విడుదల చేయాలని బాంబే కోర్టు ఆదేశించింది. దిల్లీ న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ కేసును తాము పరిశీలించడం సముచితం కాదని తెలిపింది.

దిల్లీ ఉద్యమంలో రైతుల నిరసనపై యువ పర్యావరణవేత్త గ్రెటా థన్​బర్గ్​తో పంచుకున్న టూల్​కిట్​​ కేసులో నికిత జాకబ్​, శంతను, దిశ రవిపై దిల్లీ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి దిశ రవిని ఇప్పటికే అరెస్ట్​ చేశారు దిల్లీ పోలీసులు. మిగిలిన ఇద్దరిలో శంతనుకు 10రోజుల గడువునిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన బాంబే న్యాయస్థానం.. తాజాగా నికితకు అదే తరహాలో ఊరట కల్పించింది.

ఇవీ చదవండి:'టూల్​కిట్'​ అరెస్టులపై రాజకీయ రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.