ETV Bharat / bharat

టూల్​కిట్​ కేసులో నికిత, శంతను విచారణ

author img

By

Published : Feb 22, 2021, 3:11 PM IST

టూల్​కిట్​ కేసులో న్యాయవాది నికితా జాకబ్​, ఇంజినీర్​ శంతను ములుక్​ను దిల్లీ సైబర్​ విభాగం అధికారులు ప్రశ్నించారు. అంతకుముందు వీరిద్దరికీ న్యాయస్థానం ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది.

toolkit case
టూల్​కిట్​ కేసు: దిల్లీ సైబర్​ విభాగం ఎదుట నికిత, శంతను

రైతు నిరసనలకు సంబంధించిన టూల్​కిట్​ కేసులో న్యాయవాది నిఖితా జాకబ్​, ఇంజినీర్​ శంతను ములుక్​.. సోమవారం దిల్లీలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ద్వారకాలోని దిల్లీ పోలీసు సైబర్​ విభాగం కార్యాలయంలో వీరిని ప్రశ్నించినట్లు ఓ సీనియర్​ పోలీస్​ అధికారి తెలిపారు.

రైతులు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్​ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఈ టూల్​కిట్​ డాక్యుమెంట్​ కేసులో బెంగళూరుకు చెందిన దిశ రవిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. ఈ కేసులో నికితా జాకబ్​, శంతను ములుక్​కు కోర్టు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:బొగ్గు చౌర్యం కేసులో గంభీర్​కు సీబీఐ ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.