ETV Bharat / bharat

'తగ్గిన ఆర్​ వ్యాల్యూ.. మరో రెండు వారాల్లో గరిష్ఠానికి కేసులు'

author img

By

Published : Jan 23, 2022, 3:21 PM IST

OMICRON PEAK
ఒమిక్రాన్​ పీక్​

Third Wave Peak In india: రానున్న రెండు వారాల్లో కరోనా కేసుల సంఖ్య గతంలో ఎన్నడూలేని విధంగా పెరిగి.. జీవన కాల గరిష్ఠాన్ని తాకుతుందని ఐఐటీ మద్రాస్​ అంచనా వేసింది. మరోవైపు వైరస్​ వ్యాప్తిని సూచించే ఆర్​ వ్యాల్యూ తగ్గి 1.57కు చేరినట్లు పేర్కొంది.

Third Wave Peak In india: కరోనా వైరస్​ వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్​ వ్యాల్యూ జనవరి 14 నుంచి 21 మధ్య మరింత తగ్గి 1.57కు చేరినట్లు ఐఐటీ మద్రాస్​ పరిశోధకులు తెలిపారు. మూడో వేవ్​లో వైరస్​ బారిన పడే వారి సంఖ్య రానున్న 14 రోజుల్లో మరింత పెరిగి.. దేశ జీవనకాల గరిష్ఠాన్ని తాకుతుందని అంచనా వేశారు. ఆర్​ వ్యాల్యూ 1 కంటే తక్కువగా నమోదు అయితే వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.

ఐఐటీ మద్రాస్​ వెల్లడించిన దాని ప్రకారం దేశంలో ఆర్​ వ్యాల్యూ గతంలో ఈ విధంగా నమోదు అయ్యింది.

  • జనవరి 14 నుంచి 21 వరకు 1.57
  • జనవరి 7 నుంచి 13 వరకు 2.2
  • జనవరి 1 నుంచి 6 వరకు 4
  • డిసెంబర్​ 24 నుంచి 31 వరకు 2.9 గా నమోదు అయినట్లు మద్రాస్​ ఐఐటీ పేర్కొంది.

ఈ వ్యాల్యూని కంప్యూటేషనల్ మోడలింగ్ ద్వారా ప్రాథమిక విశ్లేషణ జరిపి లెక్కించినట్లు ఐఐటీ మద్రాస్​ పరిశోధకులు తెలిపారు. ఆర్​ వ్యాల్యూ ముంబయిలో 0.67, దిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్​కతాలో 0.56 గా నమోదు అయినట్లు పేర్కొన్నారు. ముంబయి, కోల్​కతాలో ఆర్​ వ్యాల్యూ ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకుని తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. దిల్లీ, చెన్నైలో ఇంకా ఒకటికి దగ్గరగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దేశంలో 3 లక్షల 33 వేల కొత్త కేసులు.. 525 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.