ETV Bharat / bharat

చేతిపై రేపిస్ట్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య.. రెండేళ్లుగా మౌనంగా ఏడుస్తూ...

author img

By

Published : Jun 7, 2022, 4:29 PM IST

Updated : Jun 7, 2022, 8:39 PM IST

d
d

ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబీ జిల్లాలో ఓ బాలిక అత్యాచార నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలిపై నిందితుడు గత రెండేళ్లగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రెండేళ్లుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కౌశాంబీలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్లు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

d
బాలిక చేతిపై నిందితుడి పేరు

ఇదీ జరిగింది..: బాధితురాలిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన నిందితుడు కలీమ్​.. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను చిత్రీకరించాడు. వీడియోను వైరల్​ చేస్తానని బెదిరిస్తూ బాధితురాలిపై తరచూ అచ్యాచారానికి పాల్పడేవాడు. కొన్నాళ్లకు బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఆమెను వేరే గ్రామంలోని బంధువుల ఇంటికి పంపించి అక్కడే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు.

అయినా నిందితుడు వేధించడం మానలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఇంటికి తిరిగివచ్చేసింది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంపై అనుమానించిన పొరిగింటి వారు విషమ పరిస్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెను ప్రాణాలు విడిచింది.

మైనర్​పై గ్యాంగ్​రేప్​: ఉత్తర్​ప్రదేశ్​లోని బల్​రాంపుర్​ జిల్లాలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. గతనెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

అసలేం జరిగిందంటే.. బాధితురాలి తల్లికి నిందితులలో ఒకరితో వివాహేతర సంబంధం ఉంది. దీనిని వ్యతిరేకించిన బాలికపై తల్లి లేని సమయం చూసి ప్రధాన నిందితుడు మరో ముగ్గురితో కలిసి ఇంట్లోకి చొరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటికి ఇంటికి తిరిగివచ్చిన తల్లితో బాధితురాలు జరిగిన విషయం చెప్పగా నిందితులతో వివాహం చేయిస్తానంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఎస్​పీని ఆశ్రయించింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసుులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : మనవరాలిపై వృద్ధుడి రేప్.. సవతి కూతురిని ఎస్సై లైంగికంగా..

Last Updated :Jun 7, 2022, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.