ETV Bharat / bharat

ఏడేళ్ల బాలుడ్ని చితకబాదిన టీచర్​.. 38 రోజులుగా చికిత్స పొందుతూ మృతి

author img

By

Published : Oct 31, 2022, 3:43 PM IST

ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు తాళలేక ఏడో తరగతి చదువుతున్న ఓ ఎస్​సీ విద్యార్థి మరణించాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హర్​దోయిలో జరిగింది. 38 రోజులుగా చికిత్స పొందుతున్న విద్యార్థి.. శనివారం మృతిచెందాడు.

hardoi Dalit student died
hardoi Dalit student died

ఉత్తర్​ప్రదేశ్​ హర్​దోయిలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు తాళలేక 14 ఏళ్ల ఎస్​సీ బాలుడు మరణించాడు. 38 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఖననం చేసేందుకు నిరాకరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇదీ జరిగింది
సుమెర్​పుర్​కు చెందిన 14 ఏళ్ల అజయ్​ కుమార్​ ఏడో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్​ 20న రోజూలాగే తరగతులకు వెళ్లగా.. ఉపాధ్యాయుడు ప్రదీప్​ కుమార్ ద్వివేది అకారణంగా చితకబాదాడు. తిరిగి ఇంటికి వెళ్లిన అజయ్​ కుమార్​ నొప్పులతో బాధపడ్డాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడం వల్ల లఖ్​నవూలోని బలరాంపుర్​ ఆస్పత్రిలో చేర్పించారు. 38 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్​ కుమార్​ పరిస్థితి విషమించి శనివారం మరణించాడు.

ఇంటికి వచ్చిన అజయ్​ నొప్పులతో బాధపడ్డాడని.. ఆహారం, నీరు సైతం తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని అతడి అత్త తెలిపింది. కారణం అడగాగా.. టీచర్​ దారుణంగా కొట్టాడని, బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని ఆమె చెప్పింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి: తీగల వంతెన విషాదం.. భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

పెట్రోల్ బంక్​లో చోరీకి యత్నించిన దుండగుడిని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.