ETV Bharat / bharat

టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు!

author img

By

Published : Jun 20, 2021, 1:52 PM IST

Updated : Jun 20, 2021, 2:15 PM IST

Rs 55 lakh as a power bill
టీ షాపుకు రూ.55 లక్షల కరెంట్​ బిల్లు

రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకున్న ఓ చిరువ్యాపారికి షాక్ ఇచ్చింది విద్యుత్ శాఖ. అక్షరాలా రూ. 55 లక్షల కరెంటు బిల్లు వేసింది. ఈ సంఘటన హిమాచల్​ ప్రదేశ్​ ఉనా జిల్లాలో జరిగింది.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. హిమాచల్​ ప్రదేశ్​ ఉనా జిల్లాలో ఓ టీ కొట్టు యజమానిని షాక్​కు గురిచేసింది. అతని దుకాణానికి రూ. 55 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ఇది చూసిన స్థానికులు విద్యుత్తు అధికారుల తీరుపై విమర్శలు చేశారు.

ఇదీ జరిగింది...

జిల్లాలోని హరోలీలో ప్రాంతంలో నరేశ్ ​కుమార్​ అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. ఇటీవల నాలుగు నెలలకుగానూ అతనికి రూ. 6,702 బిల్లు వేసింది విద్యుత్​ శాఖ. దానిని అతను చెల్లించలేదు. దీంతో అధికారులు అతని దుకాణానికి విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. చేసేది ఏం లేక బకాయిలను ఆన్​లైన్​లో చెల్లించాలని పోర్టల్​లో చూశాడు. అంతే అక్కడ ఉన్న బిల్లును చూసి షాక్​కు గురయ్యాడు. అందులో రూ. 6 వేలకు బదులుగా.. రూ. 55 లక్షల 14వేల 945 కనిపించింది. ఒక్కసారిగా నివ్వెరపోయిన అతను విద్యుత్​ బోర్డ్​ను ఆశ్రయించాడు.

పొరపాటుగా ఎక్కువగా చూపిస్తోందని పేర్కొన్న విద్యుత్తు శాఖ అధికారులు.. సరి చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: వైరల్: మెట్రో ఎక్కిన వానరం.. ఆహ్లాదకరంగా​ ప్రయాణం!

Last Updated :Jun 20, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.