ETV Bharat / bharat

'విచారణకు హాజరు కాలేను'.. ఈడీకి సోనియా లేఖ

author img

By

Published : Jun 7, 2022, 9:53 PM IST

national herald case
national herald case

National herald case: మనీలాండరింగ్ కేసులో బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని ఈడీని కోరారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. కరోనా నుంచి కోలుకోలేనందున విచారణకు రాలేనని అభ్యర్థించారు.

National herald case: నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్ కేసులో బుధవారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. తాను రాలేనని దర్యాప్తు సంస్థను అభ్యర్థించారు. కొవిడ్‌ నుంచి కోలుకోలేనందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. సోనియాకు జూన్‌ 2న కరోనా నిర్థారణ కాగా.. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెకు నెగటివ్‌ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకాలేనని అభ్యర్ధించారు.

ఈ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ జూన్‌13న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అసలు గాంధీ జూన్​ 2నే ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం భారత్​లో లేనందున విచారణకు అందుబాటులో ఉండబోనని ఈడీకి సమాచారం అందించారు రాహుల్​. షెడ్యూల్​ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకు సమ్మతించిన ఈడీ.. జూన్​ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు రావాలని మళ్లీ సమన్లు పంపింది.

నేషనల్​ హెరాల్డ్​ కేసు ఇదే: కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

ఇదీ చదవండి: మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.2.82 కోట్ల నగదు,1.80 కిలోల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.