ETV Bharat / bharat

మహాలో 50 లక్షలకు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : May 7, 2021, 11:18 PM IST

మహారాష్ట్ర, కేరళ సహా కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారి నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే.. ఉత్తర్​ప్రదేశ్​, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్​ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 54,022 మందికి వైరస్​ సోకింది.

covid
కరోనా కేసులు

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 54,022 మంది వైరస్​ బాధితులుగా మారారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 49,96,758కి చేరింది. మరో 898 మంది కొవిడ్​కు బలయ్యారు. కొత్తగా 37 వేలకుపైగా మందికి కోలుకున్నారు.

కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 48,781 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 592 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 వేలకిపైగా మందికి వైరస్ నుంచి బయటపడ్డారు.

కేరళలో రోజువారి నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 38,460 కేసులు వెలుగుచూశాయి. మరో 54 మంది చనిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 28,076 మందికి వైరస్​ సోకింది. మరో 372 మంది చనిపోయారు. 33 వేల మంది కొవిడ్​ బారిన పడ్డారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు

రాష్ట్రంకొత్త కేసులుకొత్త మరణాలు
తమిళనాడు 26,465 197
దిల్లీ 19,832 341
బంగాల్19,216112
రాజస్థాన్18,231 164
హరియాణా 13,867162
ఛత్తీస్​గఢ్​13,628 208
గుజరాత్12,064119
మధ్యప్రదేశ్11,70884
ఉత్తరాఖండ్9,642 137
పంజాబ్8,367 165
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.