ETV Bharat / bharat

కల్తీ మద్యం కాటుకు ఐదు రోజుల్లో 11 మంది మృతి

author img

By

Published : Mar 14, 2022, 11:24 AM IST

Spurious Liquor Deaths
Spurious Liquor Deaths

Spurious Liquor Deaths: మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బిహార్​లో మరోమారు కల్తీ మద్యం కలకలం రేపింది. భగల్​పుర్, గోపాల్​గంజ్​​ జిల్లాల్లో ఐదురోజుల్లో 11 మంది మరణించగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు.

Spurious Liquor Deaths: బిహార్​లో కల్తీ మద్యం సేవించి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోమారు వెలుగుచూసింది. భగల్​పుర్​, గోపాల్​గంజ్​ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి.. ఐదు రోజుల్లో 11 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. కల్తీ మద్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్​ చేశారు.

మార్చి 13న భగల్​పుర్​ జిల్లాలోని లోదీపుర్​, బార్​గంజ్​, సబౌర్​ సహా సజోరే పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు కంటి చూపు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దాచేందుకు.. కుటుంబ సభ్యులు అంతక్రియలు నిర్వహించారని పేర్కొన్నారు.

అంతకుముందు రోజు మార్చి 12న(శనివారం) గోపాల్​గంజ్​ జిల్లాలో ఇటువంటి ఘటనే బయటపడింది. వైకుంఠపుర్​ పోలీసుస్టేషన్​ పరిధిలో నలుగురు మరణించగా.. పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. కల్తీ మద్యం వల్లే వారు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించగా.. అక్కడి అధికారులు ఖండించారు.

మార్చి 9న పశ్చిమ​ చంపానరన్​ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు అనుమానస్పద రీతిలో మరణించారు. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: అధిక రిజల్యూషన్‌తో అల్ట్రాసౌండ్‌ చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.