ETV Bharat / bharat

'చెన్నై వలంటీర్​ నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తాం'

author img

By

Published : Nov 29, 2020, 9:35 PM IST

Updated : Nov 29, 2020, 9:46 PM IST

Serum Institute rejects charges levelled by vaccine trial participant
'టీకాపై అసత్య ప్రచారం చేయటానికి కారణం ఇదే'

చెన్నైకు చెందిన ఓ వ్యక్తి.. కొవిషీల్డ్​ టీకా తనపై దుష్ప్రభావం చూపిందని చేసిన వ్యాఖ్యలపై సీరమ్ సంస్థ మండిపడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను టీకాపై మోపుతున్నారని తెలిపింది.

కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకు చెందిన ఓ వలంటీర్ చేసిన ఆరోపణలను సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ ఇండియా(సీఐఐ) ఖండించింది. వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు, వలంటీర్​ ఆరోగ్య పరిస్థితికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను వ్యాక్సిన్​పై మోపుతున్నారని మండిపడింది. డబ్బు కోసమే టీకాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. టీకాపై ఈ విధంగా ఆరోపణలు చేసిన వ్యక్తి నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.

చెన్నైకు చెందిన ఓ బిజినెస్​ కన్సల్టెంట్​.. అక్టోబర్​లో టీకా తీసుకున్నాడు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన ఆరోపించారు. కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరం సంస్థపై రూ. 5కోట్ల దావా వేశారు.

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలతో కలిసి కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తోంది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా.

ఇదీ చదవండి: సీరం టీకా వలంటీర్​ ఆరోపణలపై దర్యాప్తు

Last Updated :Nov 29, 2020, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.