ETV Bharat / bharat

'కొలీజియం సిఫార్సులపై తాత్సారమా?'.. కేంద్రం తీరుపై సుప్రీం అసహనం

author img

By

Published : Nov 28, 2022, 4:28 PM IST

Updated : Nov 28, 2022, 5:28 PM IST

supreme court collegium system
supreme court collegium system

కొలీజియం సిఫారసులపై కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియకు గడువు విధించి.. ఆలోపే పుర్తి చేయాలని సూచించింది.

కొలీజియం సిఫార్సు చేసిన జడ్జీల నియామకాలపై కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల సుప్రీంకోర్టు అంసతృప్తి వ్యక్తం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియకు గడువు విధించి.. ఆలోపే పుర్తి చేయాలని సూచించింది. జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్ ఏఎస్​ ఒకతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. నేషనల్​ జ్యుడీషియల్​ అపాయింట్​మెంట్స్ కమిషన్​ (ఎన్​జేఏసీ) చట్టం విషయంలో కేంద్రం అసంతృప్తితో ఉందని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. కొలీజియం సిఫార్సులు ఆమోదించడంలో జాప్యానికి ఇది కారణం కారాదని అభిప్రాయపడింది. కొలీజియం సిఫార్సులను జాప్యం చేస్తున్నారంటూ బెంగళూరు బార్​ అసోసియేషన్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కేంద్రం దెబ్బ తీస్తోందని ఆ వ్యాజ్యంలో పిటిషనర్లు ఆరోపించారు.

జడ్జీల నియామకానికి సిఫార్సు చేసేముందు కొలీజియం అనేక విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు వివరించింది. కొలీజియం అనేక సార్లు సిఫార్సు చేసినా జడ్జీల నియామకం జరగలేదని అటార్నీ జనరల్​ ఆర్.​ వెంకటరమణికి గుర్తు చేసింది. గత రెండు నెలలుగా కొలీజియం సిఫార్సులు యధాతథంగానే ఉన్నాయని.. వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించింది. న్యాయవ్యవస్థే చర్యలు తీసుకునేలా చేయొద్దని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్​ 8కి వాయిదా వేసిన కోర్టు.. అటార్నీ జనరల్​, సొలిసిటర్ జనరల్​ ఇద్దరూ హాజరు కావాలని ఆదేశించింది.

నేషనల్​ జ్యుడీషియల్​ అపాయింట్​మెంట్స్ కమిషన్​ (ఎన్​జేఏసీ) చట్టాన్ని 2014లో తీసుకువచ్చింది కేంద్రం. అయితే దీనిని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల కొలీజియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది. నాలుగు వారాల్లోపే కొలీజియం సిఫార్సులను ఆమోదించాలని గతేడాది ఏప్రిల్​లో కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

ఇవీ చదవండి: 'ప్రభుత్వ స్కూల్​ బాలికలకు ఫ్రీగా సానిటరీ ప్యాడ్స్​'.. ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

అదానీ పోర్టుకు వ్యతిరేకంగా 3వేల మంది నిరసన.. ఆజ్యం పోసిన మతపెద్దలు?.. సర్కారు గరం!

Last Updated :Nov 28, 2022, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.