ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 19వేల కరోనా కేసులు

author img

By

Published : Aug 14, 2021, 11:01 PM IST

corona cases india
corona cases india

కొద్ది రోజులుగా ఆందోళకర స్థాయిలో పెరిగిన కరోనా కేసులతో అతలాకుతలమైన కేరళకు స్వల్ప ఊరట లభించింది. రాష్ట్రంలో కొత్తగా 19,451వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 105మంది మహమ్మారి ధాటికి మరణించారు.

కేరళలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అక్కడ కొత్తగా 19,451 మందికి కరోనా సోకగా.. 19,104 మంది కోలుకున్నారు. 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలో కేసుల వివరాలు..

మొత్తం కేసులు : 36,51,089

కోలుకున్నవారు : 34,72,278

మృతుల సంఖ్య : 18,499

మహారాష్ట్రలో కొత్తగా 5,787 మందికి కరోనా సోకింది. 5,352 మంది కోలుకోగా.. 134 మంది మృతిచెందారు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,916 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 34 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,632 కేసులు నమోదయ్యాయి. 1,612 మంది కోలుకోగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,132 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 42 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
  • బంగాల్​లో కొత్తగా 705 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 15 మంది మరణించారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.