ETV Bharat / bharat

ఎలక్షన్ డ్యూటీలో మళ్లీ మెరిసిన 'రీనా'.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం!

author img

By

Published : Feb 22, 2022, 5:18 PM IST

Updated : Feb 22, 2022, 8:38 PM IST

Returning officer Reena Dwivedi
Returning officer Reena Dwivedi

Returning Officer Reena Dwivedi: ఉత్తర్​ప్రదేశ్​ లోక్​సభ ఎన్నికల్లో మెరిసిన సోషల్ మీడియా​ స్టార్​ రీనా ద్వివేది మరోసారి ట్రెండీ లుక్​లో దర్శనమిచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమె చుట్టూ చేరిన పోలింగ్​ సిబ్బంది, జనం.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Returning Officer Reena Dwivedi: 2019 యూపీ లోక్​సభ ఎన్నికల సమయంలో పసుపు రంగు చీరలో తళుక్కున మెరిసిన రీనా ద్వివేది గుర్తున్నారా? ఆ ఒక్క ఫొటోతో ఓవర్ నైట్ స్టార్​గా మారిపోయారు ఆ ఉత్తరప్రదేశ్​ ఎన్నికల అధికారి. ఎల్లో శారీ, చలువ కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం ఉన్న బ్యాక్స్, మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని అందంగా కనిపించిన ఆ యువ అధికారి.. అప్పట్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేశారు.

Returning officer Reena Dwivedi
ఉత్తర్​ప్రదేశ్​ లోక్​సభ ఎన్నికల సమయంలో సోషల్​ మీడియాలో స్టార్​ను చేసింది ఈ ఫొటోనే.

ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి అదిరే లుక్​లో కనిపించారు. ఈసారి కాస్త స్టైలిష్​గా. ట్రెండీ డ్రెస్​కు తోడు కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం బాక్స్​, మరో చేతిలో హాండ్​ బ్యాగ్​, సెల్​ ఫోన్​తో దర్శనమిచ్చారు. ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమెను చూసి పోలింగ్​ సిబ్బంది సెల్ఫీల కోసం ఎగబడడం విశేషం.

ఆ అధికారి వస్త్రధారణ చూసి అక్కడి అధికారులు, జనం ఆశ్చర్యపోయారు.

Returning officer Reena Dwivedi
రీనా ద్వివేది ఉత్తర్​ప్రదేశ్​ ప్రజాపనుల శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.
Returning officer Reena Dwivedi
ఇన్​స్టాలో తరచూ ఫొటోలు షేర్​ చేస్తుంటారు రీనా
Returning officer Reena Dwivedi
సామాజిక మాధ్యమాల్లో ఈమెకు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Returning officer Reena Dwivedi
దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడం పట్ల గతంలో సంతోషం వ్యక్తం చేశారు ఈ యువ అధికారి.

బుధవారమే నాలుగో దశ పోలింగ్​..

UP Election 4th Phase: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్​ బుధవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​ నిర్వహించనున్నారు.

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్​కు 48 గంటల ముందే (సోమవారం సాయంత్రం) ప్రచారం ముగిసింది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నం చేశాయి.

Returning officer Reena Dwivedi
ఉత్తర్​ప్రదేశ్​ నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సిద్ధం

గతేడాది అక్టోబర్​ 3న విధ్వంసం జరిగిన లఖింపుర్​ ఖేరీలో ఈ దశలోనే పోలింగ్​ జరగనుంది. నిరసన చేస్తున్న వారిపై కారు దూసుకెళ్లగా నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ఈ ఘటనలో మరణించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఓటర్లు ఎవరిని కనికరిస్తారో చూడాలి.

ఎన్నికలు జరిగే స్థానాలు : 59

బరిలో నిలిచిన అభ్యర్థులు : 629

ఎన్నికలు జరగనున్న జిల్లాలు : పీలీభీత్​, లఖింపుర్​ ఖేరీ, సీతాపుర్​, హర్దోయ్​, ఉన్నావ్​, లఖ్​నవూ, రాయ్​ బరేలీ, బాందా, ఫతేపుర్​.

బరిలో ప్రముఖులు : బ్రిజేశ్​ పాఠక్​(యూపీ న్యాయశాఖ మంత్రి), అశుతోశ్​ టాండన్​(యూపీ మంత్రి), నితిన్​ అగర్వాల్​(యూపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​), రాజేశ్వర్​ సింగ్​(ఈడీ మాజీ అధికారి)

ఫలితాలు : మార్చి 10

ఇప్పుడు ఎన్నికలు జరగనున్న 59 స్థానాలకుగానూ.. 2017లో భాజపా 51 చోట్ల గెలుపొందింది. సమాజ్​వాదీ పార్టీ 4, బహుజన్​ సమాజ్​పార్టీ 3 చోట్ల విజయం సాధించాయి.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.

ఇవీ చూడండి: 'దేశవ్యాప్త గుర్తింపుతో బిజీ అయిపోయా'

ఎన్నికల్లో మెరిసిన ఈ అధికారిణి గురించి తెలుసా?

Last Updated :Feb 22, 2022, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.