ETV Bharat / bharat

'రామ మందిరం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక'

author img

By

Published : Jan 7, 2021, 7:10 PM IST

Ram temple to be symbol of India's self-respect and pride: RSS
'రామ మందిరం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక'

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం.. దేశ ఆత్మాభిమానానికి చిహ్నం అని పేర్కొంది ఆర్​ఎస్​ఎస్​. అందుకే రామమందిర నిర్మాణానికి కావాల్సిన నిధుల సేకరణను మెగా కార్యక్రమంగా నిర్వహించాలని భావిస్తుంది. ఈ మేరకు ఆర్​ఎస్​ఎస్,​ దాని అనుంబంధ సంస్థలు నిర్వహించిన మూడురోజుల సమావేశంలో నిర్ణయించుకున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో నిర్మించనున్న రామాలయం దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించింది రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​). రామాలయానికి భూమి పూజను భారతదేశ చరిత్రలో ఓ మలుపుగా అభివర్ణించింది.

మందిర నిర్మాణానికి కావాల్సిన నిధులు సేకరణను ఓ మహా కార్యక్రమంలా నిర్వహించాలని నిర్ణయించింది ఆర్​ఎస్​ఎస్​. ఇందుకోసం దాని అనుబంధ సంస్థల ద్వారా 5 లక్షల గ్రామాల్లో 10 కోట్ల కుటుంబాలకు చేరువ కానున్నట్లు తెలిపింది. గుజరాత్​లోని ఉవర్సాద్​ గ్రామంలో ఆర్​ఎస్​ఎస్​, మరో 34 అనుబంధ సంస్థల ప్రతినిధులు కలిసి నిర్వహించిన 3 రోజుల సదస్సులో ఈమేరకు చర్చించినట్లు వివరించింది.

జనవరి 5న ప్రారంభమైన ఈ సమావేశంలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​, భయ్యాజీ జోషి, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా 34 సంస్థల అధినేతలు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మూడు విషయాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.

  • కులం, భాష, వ్యత్యాసాలను అధిగమించి సామాజిక సమానత్వం సాధించడం
  • హిందూ సమాజంలో జననాలు, హిందూ కుటుంబ విలువలను ప్రోత్సహించడం
  • పర్యావరణాన్ని పరిరక్షించడం

ఇదీ చూడండి: పేర్ల మార్పుపై 'మహా' కూటమిలో కొత్త చిచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.