ETV Bharat / bharat

రక్తమోడిన రహదారులు.. రోడ్డుప్రమాదాల్లో 20 మంది మృతి

author img

By

Published : May 15, 2022, 7:58 PM IST

Rajasthan road accidents: రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వివిధ రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Rajasthan road accidents
రక్తమోడిన రహదారులు

Rajasthan road accidents: రాజస్థాన్​లో రహదారులు రక్తమోడాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదం నింపాయి. రాజస్థాన్​లో జరిగిన మూడు ప్రమాదాల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర​లో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మరణించారు.

రాజస్థాన్ సిరోహీ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటనలో.. ఆరుగురు మరణించారు. ఓ ట్రక్కు.. రెండు కార్లతో పాటు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. సిరోహీ నుంచి శివగంజ్​కు వెళ్తున్న ట్రక్కు.. అదుపుతప్పి పక్క లేన్​లోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లు, ఓ ట్రక్కును ఢీకొట్టిందని చెప్పారు. మృతుల్లో మూడు నెలల పసికందు సైతం ఉందని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సన్యమ్ లోధా.. క్షతగాత్రులు ఉన్న ఆస్పత్రిని సందర్శించారు.
రాజస్థాన్​లోని అల్వార్​లో ట్రక్కు, ఆటో ఢీకొట్టుకోవడం వల్ల.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. సికంద్ర హైవేపై ఈ ఘటన జరిగింది.

మరోవైపు, రాజసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు.. ట్రక్కు ఢీకొనగా... నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనస్థలిలోనే ముగ్గురు మరణించగా... చికిత్స పొందుతూ మరొకరు తుదిశ్వాస విడిచారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెప్పారు. జైపుర్ నుంచి వస్తున్న బస్సు.. తెల్లవారుజామున 5.30 గంటలకు ట్రక్కును ఓవర్​టెక్ చేసే క్రమంలో అదుపుతప్పిపోయిందని అధికారులు చెప్పారు. దీంతో ట్రక్కును ఢీకొట్టిందని తెలిపారు.
అటు, అజ్మీర్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అల్వార్​గేట్ సమీపంలోని నరేలీ బైపాస్ వద్ద ట్రక్కును మరో వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

Road accident in Maharashtra: మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాహురీ తాలుకాలోని గుహా ఫతా వద్ద ఈ ఘటన జరిగింది. నగర్ నుంచి శిర్డీకి వెళ్తున్న బస్సు.. ఆదివారం మధ్యాహ్నం ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

maharashtra road accident
నుజ్జు నుజ్జు అయిన కారు
maharashtra road accident
పూర్తిగా ధ్వంసమైన కారు

ఇదీ చదవండి:

కాలువలోకి దూసుకెళ్లిన 'పెళ్లి కారు'.. ఆరుగురు మృతి

'పెదాలపై ముద్దుపెట్టడం అసహజ లైంగిక నేరం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.