ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​లో కూలిన బ్రిడ్జ్.. పట్టాలపై పడి ఒకరు మృతి.. 12 మందికి గాయాలు

author img

By

Published : Nov 27, 2022, 7:05 PM IST

Updated : Nov 27, 2022, 9:55 PM IST

రైల్వే స్టేషన్​లో ఉన్న పురాతన పాదచారుల వంతెనలో ఓ భాగం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రపుర్​లో జరిగింది.

bridge collapse in chandrapur
bridge collapse in chandrapur

రైల్వే స్టేషన్​లో కూలిన బ్రిడ్జ్

మహారాష్ట్ర చంద్రపుర్​ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. బల్లార్​పుర్​ రైల్వే స్టేషన్​లో ఉన్న పురాతన పాదచారుల వంతెనలో కింద భాగం కూలింది. దీంతో పట్టాలపై పడిపోయారు ప్రయాణికులు. గాయపడిన వారిలో.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 5:10 గంటల సమయంలో జరిగింది. మరోవైపు దీనిపై స్పందించిన సీపీఆర్​ఓ.. నలుగురు ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టేషన్​కు రైలు వస్తుందన్న హడావుడిలో ప్రజలు ఒక్కసారిగా వంతెనపైకి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వంతెన శిథిలావస్థ స్థితికి చేరుకోవడమూ.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్​గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ.

bridge collapse in chandrapur
కూలిన వంతెన
bridge collapse in chandrapur
క్షతగాత్రులను తరలిస్తున్న స్థానికులు

ఇవీ చదవండి: దుండగుల బీభత్సం బైక్​పై వచ్చి ఒకేరోజు ఆరు ప్రాంతాల్లో కాల్పులు

విచిత్రంగా జడేజా 'ఫ్యామిలీ పాలిటిక్స్'.. భాజపా అభ్యర్థిగా భార్య.. కాంగ్రెస్​ ప్రచారకర్తగా చెల్లి

Last Updated :Nov 27, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.