ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్​

author img

By

Published : Oct 29, 2021, 4:14 PM IST

Updated : Oct 29, 2021, 5:08 PM IST

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో విచారణ కోసం ఆయన సూరత్ కోర్టుకు వెళ్లారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్​లోని​ సూరత్​ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్​తోపాటు మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది.

Rahul Gandhi
సూరత్​ కోర్టులో రాహుల్​ గాంధీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మోదీ' పేరును ఉద్దేశించి రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్​పై పరువు నష్టం కేసు వేశారు. పరిశీలనకు స్వీకరించిన సూరత్​ కోర్టు.. న్యాయస్థానానికి రాహుల్ హాజరు కావాలని గతంలో నోటీసులు పంపింది.

ఇదీ చదవండి:

Last Updated : Oct 29, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.