ETV Bharat / bharat

Rahul Gandhi On Modi: ' ఏడాదిపాటు రైతులను రోడ్లపై వదిలేసిన మోదీ'

author img

By

Published : Feb 5, 2022, 6:43 PM IST

Rahul Gandhi On Modi
మోదీపై రాహుల్​ గాంధీ

Rahul Gandhi On Modi: ప్రధాని మోదీ రైతులను ఏడాదిపాటు రోడ్లపై వదిలేశారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్​కు ప్రధానమంత్రి లేరని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు మాట్లాడొద్దని భావించే రాజు ఉన్నారని ఎద్దేవా చేశారు.

Rahul Gandhi On Modi: కాంగ్రెస్ సీనియర్ ​నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కొవిడ్-19 సమయంలో మోదీ రైతులను ఏడాదిపాటు రోడ్లపై వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పని ఎప్పుడూ చేయదని స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్​లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కిచ్ఛాలో నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. భారత్​కు ప్రధానమంత్రి లేరని.. కానీ తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు నోరుమెదపకుండా ఉండాలని అనుకునే రాజు మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ రైతులు, యువత, కార్మికులు, పేదల భాగస్వామ్యంతో ముందుకెళ్తోందని అన్నారు రాహుల్ గాంధీ.

70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్​లో ఫిబ్రవరి 14న పోలింగ్​ జరగనుంది.

ఇవీ చూడండి:

Uttarakhand Election 2022: యువోత్సాహమా? అనుభవ దరహాసమా?

ఉత్తరాఖండ్​లో మోదీ ఇమేజ్​ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.