ETV Bharat / bharat

'పీఎం కేర్స్ ఫండ్​ పారదర్శకతకో నమస్తే'

author img

By

Published : Dec 17, 2020, 5:23 PM IST

Rahul Gandhi criticises Modi
పీఎం కేర్స్​పై కాంగ్రెస్ విమర్శలు

కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి కేంద్రం పొందిన 'పీఎం కేర్స్ విరాళాలపై' కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. పీఎం కేర్స్​పై వచ్చిన ఓ వార్త ఆధారంగా పీఎం కేర్స్​ పారదర్శకతకు నమస్తే అని వ్యంగ్యంగా ట్వీట్​ చేశారు.

'పీఎం కేర్స్' విరాళాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.

'పీఎం కేర్స్​పై సందేహాలు: ఈ నిధి ప్రభుత్వానిదా, ప్రైవేటు కంపెనీలదా? అని ఇంకా స్పష్టంగా తెలియదు' అని ఉన్న ఓ ఆంగ్ల వార్తా పత్రిక శీర్షికను ట్విట్టర్​లో షేర్ చేస్తూ.. 'పీఎం కేర్స్- చలియే ట్రాన్స్పరెన్సీ కో వనక్కం (పారదర్శకతకు నమస్తే)' అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు రాహుల్​.

ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మోదీకి బుధవారం పలు ప్రశ్నలు సంధించారు. మరుసటి రోజే రాహుల్ ఈ విమర్శలకు దిగటం గమనార్హం.

ఇదీ చూడండి:పీఎం కేర్స్​ విదేశీ విరాళాలపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.