ETV Bharat / bharat

'భారీగా తరలిరండి.. ఓట్లు వేయండి'

author img

By

Published : Apr 6, 2021, 9:51 AM IST

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో.. ఓటర్లంతా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రికార్డు స్థాయిలో ఓటర్లు పాల్గొనాలని ట్వీట్​ చేశారు మోదీ. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కూడా ఇదే తరహాలో ట్వీట్​ చేశారు.

PM urges people to vote in large numbers
రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలి

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో శాససనభ ఎన్నికల పోలింగ్‌ జరగుతున్న వేళ.. ఓటర్లందరూ పెద్దఎత్తున పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం, కేరళ, తమిళనాడు, బంగాల్​, పుదుచ్చేరిలో ఓటర్లు.. రికార్డుస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా.. యువత ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

PM Narendra Modi Tweet
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. బలమైన సంకల్పం, అవినీతి రహిత ప్రభుత్వం మాత్రమే అభివృద్ధిని సాధించగలదని.. దాన్ని ఎన్నుకునేందుకు ఓటింగ్‌లో పాల్గొనాలని ట్వీట్‌ చేశారు షా.

Amit Shah Tweet
హోం మంత్రి అమిత్​ షా ట్వీట్​

ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

Rahul Gandhi Tweet
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్వీట్​

ఇదీ చదవండి: లైవ్​ అప్​డేట్స్​: ఓటేసిన కమల్​-రజనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.