ETV Bharat / bharat

పుతిన్​తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?

author img

By

Published : Feb 24, 2022, 10:44 PM IST

Updated : Feb 24, 2022, 11:33 PM IST

PM Narendra Modi
పుతిన్​తో మాట్లాడిన ప్రధాని మోదీ

22:38 February 24

పుతిన్​తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?

Modi speaks to Putin: ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్​ను మోదీ కోరినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని మోదీ సూచించినట్లు పేర్కొంది. ఇక ఉక్రెయిన్​కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి పుతిన్​.. మోదీకి వివరించినట్లు తెలిపింది పీఎంఓ కార్యాలయం.

నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు మోదీ.ఉక్రెయిన్​లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్లు పీఎంఓ తెలిపింది. వారిని సురక్షితంగా భారత్​కు తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పుతిన్​కు వివరించినట్లు పీఎంఓ వెల్లడించింది.

తమ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల అధికారులు, దౌత్య బృందాలు తరుచుగా సంప్రదింపులు జరిపేందుకు పీఎం మోదీ, ప్రెసిడెంట్​ పుతిన్​ అంగీకరించినట్లు పేర్కొంది.

భారత్​ కోరుకునేది అదే..

ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉన్నచోట భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. ఇరు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్​ కోరుకుంటోందని అన్నారు.

Last Updated :Feb 24, 2022, 11:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.