ETV Bharat / bharat

Live Updates : బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా: ప్రధాని

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 2:59 PM IST

Updated : Oct 3, 2023, 5:35 PM IST

PM MODI
PM MODI

17:34 October 03

  • రాష్ట్రంలో ఐదేళ్లు బీజేపీకు అవకాశం ఇవ్వండి: ప్రధాని మోదీ
  • బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా: ప్రధాని
  • వంశపారంపర్యంగా పదవిలో ప్రజాస్వామ్యంలో కుదరదు: ప్రధాని

17:24 October 03

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ దిల్లీ వచ్చి నన్ను కలిశారు : ప్రధాని
  • ఎన్డీఏలో చేరతామని కేసీఆర్‌ అడిగారు : ప్రధాని
  • తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్‌ కోరారు : ప్రధాని
  • ఇది రాజరికం కాదని నేను కేసీఆర్‌కు చెప్పాను : ప్రధాని
  • ప్రజలు ఆశీర్వదించివారే పాలకులని నేను చెప్పాను : ప్రధాని
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించింది : ప్రధాని
  • దక్షిణ భారతం కాంగ్రెస్‌ను క్షమిస్తుందా? : ప్రధాని

17:17 October 03

  • కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు
  • తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు
  • కాంగ్రెస్‌ పార్టీని దేశమంతా తిరస్కరించింది: ప్రధాని మోదీ
  • కాంగ్రెస్‌ పాలన తెలంగాణను వెనకబడేలా చేసింది: ప్రధాని
  • రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ఓటమి ఖాయం అయ్యింది: ప్రధాని
  • కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్​ఎస్​ లోపాయకారీగా మద్దతు ఇచ్చింది
  • కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ మధ్య రహస్య స్నేహం ఉంది: ప్రధాని
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 40కి పైగా స్థానాల్లో గెలిచింది: మోదీ
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ వస్తే ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు
  • తెలంగాణ ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు చూసి ఆశ్చర్యపోయాను

17:12 October 03

  • తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది: ప్రధాని
  • తెలంగాణలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నాం: ప్రధాని
  • తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోంది: ప్రధాని
  • ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైంది: ప్రధాని
  • తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోంది

17:09 October 03

  • మహిళలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా
  • కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకున్నాం
  • భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నాం: ప్రధాని
  • తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలి
  • తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి
  • ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే: ప్రధాని
  • దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు
  • ఒక గుజరాత్ బిడ్డ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం కృషి చేశారు

17:03 October 03

  • ఎన్టీపీసీతో రాష్ట్రంలో 4 వేల మెగావాట్లు విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది : ప్రధాని
  • ఎన్టీపీసీ సూపర్‌ పవర్ ప్లాంటుతో రాష్ట్రంలో ఎంతో మార్పు రానుంది : ప్రధాని
  • పెద్దపల్లి ఎన్టీపీసీ విద్యుత్‌ ప్లాంట్‌ను శరవేగంగా నిర్మించుకున్నాం : ప్రధాని
  • ఎన్టీపీసీ ప్లాంట్‌ నుంచి తయారయ్యే విద్యుత్‌లో ఎక్కువ భాగం తెలంగాణకే కేటాయిస్తాం : ప్రధాని
  • ఎన్టీపీసీ ప్లాంట్‌ శంకుస్థాపన చేసిందీ నేనే.. ప్రారంభించిందీ నేనే.. : ప్రధాని

16:58 October 03

  • పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి
  • రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే బీజేపీ పాలనను కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రజలు ఇక చాలు కేసీఆర్‌.. ఇక సెలవు కేసీఆర్‌ అంటున్నారు: కిషన్‌రెడ్డి
  • బీజేపీ ప్రత్నామ్నాయ పార్టీగా ఎదగకుండా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు

16:27 October 03

నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని

  • నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
  • పెద్దపల్లిలో అత్యాధునిక సూపర్‌ పవర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది
  • పెద్దపల్లి జిల్లాలో సూపర్‌ థర్మల్ పవర్‌ ప్రాజెక్టు తొలి యూనిట్ ప్రారంభించుకున్నాం
  • త్వరలోనే రెండో యూనిట్‌ అందుబాటులోకి వస్తుంది: మోదీ
  • ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్లు విద్యుత్‌ అందుబాటలోకి వస్తుంది
  • ధర్మాబాద్‌- మనోహరాబాద్‌-మహబూబ్‌నగర్‌-కర్నూలు లైను విద్యుదీకరణ పూర్తి చేసుకున్నాం
  • తెలంగాణ ప్రజల కోసం బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మిస్తున్నాం: ప్రధాని
  • ప్రపంచంలోనే అతిపెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తున్నాం

16:25 October 03

  • సభావేదిక పైనుంచి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని
  • రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
  • సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంటును జాతికి అంకితం చేసిన ప్రధాని
  • మనోహరాబాద్‌- సిద్దిపేట రైల్వే లైన్‌ ప్రారంభించిన ప్రధాని

16:14 October 03

  • 2014కు ముందు దేశంలో విద్యుత్‌ కొరత ఉండేది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • మోదీ ప్రధాని అయ్యాక విద్యుత్‌ సమస్య పరిష్కరించారు: కిషన్‌రెడ్డి
  • ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యుత్‌ కోతలు లేవు: కిషన్‌రెడ్డి
  • ప్రపంచాన్ని వణికించిన కరోనాను భారత్‌ సమర్థంగా ఎదుర్కొన్నది
  • దేశ ప్రజలందరికీ మోదీ సర్కార్‌ 2 డోసుల కొవిడ్ టీకాను ఉచితంగా ఇచ్చింది

15:58 October 03

  • పసుపు రైతుల బాగు కోసం ఏమైనా చేస్తామని మోదీ చెప్పారు: అర్వింద్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ ఇవ్వాలని కేంద్రం ఎన్నోసార్లు అడిగింది: అర్వింద్‌
  • 2017 నుంచి కేంద్రం కాళేశ్వరం డీపీఆర్‌ అడిగితే ఇవ్వటం లేదు: అర్వింద్‌
  • కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతి బయటపడుతుందనే భయంతోనే డీపీఆర్‌ ఇవ్వట్లేదు
  • దేశ, ప్రజల కష్టాలు తీర్చేది ప్రధాని మోదీ మాత్రమే: ఎంపీ అర్వింద్‌
  • పసుపు రైతుల గోస తీర్చినట్లే.. చెరుకు రైతుల కష్టాలు కూడా తీరతాయి
  • త్వరలోనే చక్కెర మిల్లుల సమస్యను కూడా మోదీ పరిష్కరిస్తారు
  • నిజామాబాద్‌, మెట్‌పల్లిలో మళ్లీ చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలి
  • నిజామాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది

15:54 October 03

  • నిజామాబాద్​కు చేరుకున్న ప్రధాని మోదీ

15:48 October 03

  • నిజామాబాద్​లోని మోదీ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు
  • భారీగా తరలి వచ్చిన జనంతో నిండిపోయిన సభ
  • స్థలం లేక సభకు వచ్చే గేట్లను మూసేసిన పోలీసులు
  • బయట ఉన్న ప్రజలను పంపించేస్తున్న పోలీసులు
  • సభలో స్థలం లేక బైపాస్ రోడ్డును మూసేసిన పోలీసులు

15:25 October 03

  • బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు ఇస్తున్నాయి: డీకే అరుణ
  • అధికారంలోకి రావటానికి సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు
  • ధనిక తెలంగాణను ఇప్పటికే కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మార్చారు
  • బీజేపీ మాత్రం.. చేసేదే చెప్తుంది, చెప్పింది చేస్తుంది: డీకే అరుణ
  • తెలంగాణను రక్షించుకోవటానికి బీఆర్​ఎస్​ హఠావో నినాదం ఇవ్వాలి

15:00 October 03

నిజామాబాద్​లోని బీజేపీ ఇందూరు ప్రజా గర్జన బహిరంగ సభ

  • నిజామాబాద్​లోని బీజేపీ ఇందూరు ప్రజా గర్జన బహిరంగ సభ
  • గిరిరాజ్ కళాశాల మైదానంలో మోదీ బహిరంగ సభ
  • కాసేపట్లో సభకు చేరుకోనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  • బీజేపీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు, పసుపు రైతులు
  • సభా వేదిక వద్ద రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు
  • మోదీకి స్వాగతం పలకనున్న 600 మంది మహిళలు

14:50 October 03

ప్రధాని మోదీ నిజామాబాద్​ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం

  • రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన
  • కర్ణాటకలోని బీదర్ నుంచి నిజామాబాద్‌కు రానున్న ప్రధాని
  • మధ్యాహ్నం 2.55 గం.కు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా నిజామాబాద్‌కు మోదీ
  • మధ్యాహ్నం 3 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
  • మధ్యాహ్నం 3.45 గంటలకు సభాస్థలానికి చేరుకోనున్న ప్రధాని మోదీ
  • సభ అనంతరం సాయంత్రం 5 గం.కు హెలికాప్టర్‌లో బీదర్‌కు తిరుగుపయనం
  • బీదర్‌ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లనున్న ప్రధాని మోదీ
  • రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ
  • రాష్ట్రంలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
  • ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం
  • రూ.6 వేల కోట్లతో నిర్మిచిన 800 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు జాతికి అంకితం
  • మనోహరాబాద్- సిద్దిపేట కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించనున్న మోదీ
  • ధర్మాబాద్-మనోహరాబాద్ కొత్త లైన్‌ విద్యుదీకరణ పనులు ప్రారంభం
  • మహబూబ్‌నగర్- కర్నూల్ కొత్త లైన్‌ విద్యుదీకరణ పనులు ప్రారంభం
  • సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్న ప్రధాని
  • సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ
Last Updated :Oct 3, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.