ETV Bharat / bharat

దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

author img

By

Published : Nov 27, 2021, 11:34 AM IST

PM Modi
ప్రధాని మోదీ

దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఒమిక్రాన్‌ వేరియంట్' కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతున్నవేళ దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో కొవిడ్ నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్‌పై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్.. వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.