ETV Bharat / bharat

'అభివృద్ధికి అడ్డుపడిన నకిలీ సమాజ్​వాదీలతో జాగ్రత్త'

author img

By

Published : Feb 7, 2022, 1:24 PM IST

Updated : Feb 7, 2022, 4:19 PM IST

PM Narendra Modi News
నకిలీ సమాజ్​వాదీలతో జాగ్రత్త.

PM Modi News: యూపీలో నకిలీ సమాజ్​వాదీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రధాని నరేంద్రమోదీ. వారి హయాంలో అభివృద్ధి అనే నదీ ప్రవాహం ఆగిపోయిందని ధ్వజమెత్తారు. సొంత, సన్నిహితుల ప్రయోజనాల కోసమే వారు పనిచేశారని విమర్శించారు.

Modi Bijnor Rally: ఉత్తర్​ప్రదేశ్​లో ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నకిలీ సమాజ్​వాదీల హయాంలో అభివృద్ధి అనే నదీ ప్రవాహం ఆగిపోయిందని విమర్శించారు. సొంత, సన్నిహితుల ప్రయోజనాల కోసమే వారు పనిచేశారని, రాష్ట్ర అభివృద్దిని పట్టించుకోకుండా స్వార్థంగా వ్యవహరించారని ఆరోపించారు.

" రైతులకు, పశ్చిమ యూపీ ప్రజలందరికీ నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నవారిని ఓ విషయం అడగండి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రాంతంలోని గ్రామాలకు ఎంత ​కరెంటు ఇచ్చారని ప్రశ్నించండి. కేంద్ర, రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాలు రైతుల గౌరవాన్ని, హక్కులను తిరిగి తెస్తున్నాయి. గత ఐదేళ్లలో చెరకు రైతులకు రూ.1.5లక్షల కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంతకుముందు రెండు ప్రభుత్వాలు కలిపి చెల్లించిన మొత్తానికంటే ఇది అధికం. చౌదరి చరణ్​ సింగ్ వారసులమని చెప్పుకునే వారే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు."

-ప్రధాని మోదీ.

Modi Speech Today

25 ఏళ్ల తర్వాత భారత్​కు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, ఆ సమయానికి యూపీ అభివృద్ధి విజయగాథల గురించి దేశం తెలుసుకునే స్థాయికి రాష్ట్రం చేరాలని ఆకాంక్షించారు మోదీ. ఆ దిశగా భాజపా ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని పేర్కొన్నారు.

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజ్నోర్ ర్యాలీలో వర్చువల్​గా పాల్గొన్నారు మోదీ. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్​ ర్యాలీలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

Modi Uttarakhand Rally

ఉత్తరాఖండ్​లో..

యూపీ అనంతరం ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు మోదీ. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వారికి, దాన్ని వ్యతిరేకించిన వారికి మధ్యే అని పేర్కొన్నారు. రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని జరగనివ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు వారికి వ్యతిరేకంగా జరిగినందుకే ఇలా చేశారని ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ ప్రజల కలలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని, వారి పాపాలను ప్రజల మర్చిపోరని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ను 'డబుల్​ బ్రేక్'​ గా అభివర్ణించారు. భాజపాది 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం అన్నారు.

ఇదీ చదవండి: 'మంచి రోజులు ఎవరికి?'.. కేంద్రంపై రాహుల్​ ఫైర్!

Last Updated :Feb 7, 2022, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.