ETV Bharat / bharat

'మంచి రోజులు ఎవరికి?'.. కేంద్రంపై రాహుల్​ ఫైర్!

author img

By

Published : Feb 7, 2022, 12:51 PM IST

RAHUL FIRES ON CENTRE: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని సూచిస్తూ కేంద్రంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. దేశంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆయన ఆరోపించారు.

RAHUL COMMENTS ON CENTRE
రాహుల్​ గాంధీ ట్వీట్

RAHUL FIRES ON CENTRE: నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులపై జరిగిన ఓ సర్వే నివేదికను ఉదాహరిస్తూ.. మంచి రోజులు ఎవరికి వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు #KiskeAccheDin అనే హ్యాష్​ ట్యాగ్​తో రాహుల్​ గాంధీ ట్వీట్ చేశారు.

దేశంలో ఉన్న 67 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయి.. తాత్కాలికంగా మూతపడ్డాయని ఆరోపించారు రాహుల్​. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం లాభాలు తగ్గాయని ఆయన అన్నారు. కేంద్రం ఆదుకోకపోవడం వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

"సూక్ష్మ, మధ్య తరగతి వ్యాపారులు సౌకర్యవంతంగా వ్యాపారం చేసుకోలేకపోతున్నారు. ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారు. ఇది మోదీ పాలనకు నిదర్శనం"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చదవండి: 'తొలి దశలోనే భాజపాకు కళ్లు, చెవులు తెరుచుకుంటాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.