ETV Bharat / bharat

PM Modi: జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ!

author img

By

Published : Jun 19, 2021, 7:36 AM IST

Updated : Jun 19, 2021, 10:20 AM IST

జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 24న భేటీ కానున్నారు. కశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణ తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

pm modi
ప్రధాని నరేంద్ర మోదీ

జమ్ముకశ్మీర్​లోని రాజకీయ పార్టీల నేతలతో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. కశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించనున్నారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్​ ప్రత్యేకహోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే.

ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర నాయకులు హాజరవుతారు. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్ లోనె తదితరులు చర్చల్లో పాల్గొనేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్​!

Last Updated : Jun 19, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.