ETV Bharat / bharat

'గత పాలకులకు యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు'

author img

By

Published : Dec 28, 2021, 3:40 PM IST

Updated : Dec 28, 2021, 5:10 PM IST

PM Modi kanpur visit, మోదీ కాన్పుర్ పర్యటన
'గత పాలకులకు యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు'

PM Modi kanpur visit: ఉత్తర్​ప్రదేశ్​లో గత పాలకులకు అభివృద్ధి పట్ల ధ్యాసే లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రాజెక్టులను చేపట్టినట్లు చెప్పారు. కాన్పుర్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణించారు.

'గత పాలకులకు యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు'

PM Modi kanpur visit: గత పాలకులు నిర్లక్ష్యం వల్లే ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధికి నోచుకోలేదని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. వారు సొంత ప్రయోజనాల గురించి ఆలోచించారు తప్ప ప్రజల అవసరాలపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు.

PM Modi kanpur visit, మోదీ కాన్పుర్ పర్యటన
మెట్రోలో మోదీ, యోగి

యూపీ పర్యటనలో భాగంగా కాన్పుర్ మెట్రో రైలు ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రారంభించారు మోదీ. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్​ పూరితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు.

PM Modi kanpur visit, మోదీ కాన్పుర్ పర్యటన
మెట్రోలో మోదీ, హర్దీప్​ సింగ్ పూరి

Modi inaugurates kanpur metro

ఐఐటీ కాన్పుర్​, మోతీ ఝీల్​ను అనుసంధానించే ఈ ప్రాజెక్టు 9కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం 32 కిలోమీటర్లు ఉన్న కాన్పుర్​ మెట్రో ప్రాజెక్టును రూ.11,000కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దేశంలో అత్యంత వేగంగా నిర్మించిన మెట్రో ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.

PM Modi kanpur visit, మోదీ కాన్పుర్ పర్యటన
మోదీ, యోగి

2019 నవంబర్​ 15న సీఎం యోగి ఆదిత్యనాథ్​ కాన్పుర్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు . ఈ ఏడాది నవంబర్​ 10న ఐఐటీ కాన్పుర్​ నుంచి మోతీ ఝీల్​ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.

పర్యటనలో భాగంగా బినా-పంకీ మల్టీప్రోడక్ట్​ పైప్​లైన్ ప్రాజెక్టును కూడా మోదీ ప్రారంభించారు.

స్టార్టప్ హబ్​గా భారత్​..

అంతకుముందు ఐఐటీ కాన్పుర్​ 54వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్పొన్నారు మోదీ. ఈ కార్యక్రమంలో బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్​ డిగ్రీలను ప్రారంభించారు. దేశానికి ఐఐటీ కాన్పుర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రస్తుతం భారత్​ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్​ హబ్​గా అవతరించిందని చెప్పారు. 75 యూనికార్న్​లు, 50వేలకుపైగా అంకుర సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో 10వేల సంస్థలు గత ఆరు నెలల కాలంలోనే అవతరించినట్లు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: 'చరిత్రను కాలరాసి.. దేశ వారసత్వాన్ని చెరిపేందుకు కుట్ర'

Last Updated :Dec 28, 2021, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.