ETV Bharat / bharat

ఐసీయూలో రోగిని కరిచిన ఎలుక- మేయర్ సీరియస్​

author img

By

Published : Jun 22, 2021, 11:03 PM IST

rat
మూషికం, ఎలుక

మహారాష్ట్ర ముంబయిలో ఓ వింత ఘటన జరిగింది. ఓ రోగిని ఎలుక కరిచింది. కంటికి సమీపంలో స్వల్ప గాయాలు చేసింది. చివరకు ఏమైందంటే..

మహారాష్ట్ర ముంబయిలో షాకింగ్​ ఘటన జరిగింది. ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి కంటి సమీపంలో ఎలుక కరిచింది. అయితే.. దీనివల్ల రోగి కంటికి ఎలాంటి అపాయం జరగలేదని రాజ్​వాది ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆసుపత్రి డీన్ డాక్టర్ విద్యా థాకూర్ అన్నారు. రోగికి స్వల్ప గాయాలే అయినప్పటికీ వాటిని అశ్రద్ధ చేయలేమని పేర్కొన్నారు.

రోగికి కంటికి శస్త్రచికిత్స జరిగి ఐసీయూలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అతని బంధువు తెలిపారు.

అయితే.. గ్రౌండ్​ ఫ్లోర్​లో ఈ ఘటన జరిగిందని వైద్యురాలు వెల్లడించారు. కొందరు ఆసుపత్రి సమీపంలో చెత్త పడేస్తారని, అందుకే ఇలాంటి ప్రమాదం తలెత్తిందని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మేయర్ సీరియస్​

ఈ ఘటనపై ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇదీ చదవండి:సినీ ఫక్కీలో బ్యాంకు గోడకు కన్నం- రూ.లక్షల్లో దోపిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.