ETV Bharat / bharat

Pak Terrorist Plans : రాష్ట్రపతి భవన్​పై దాడికి కుట్ర​! పాక్​ ఉగ్రసంస్థకు ఆ చిత్రాలు.. పోలీసులు అలర్ట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 10:25 PM IST

Updated : Sep 7, 2023, 10:38 PM IST

Pak Terrorist Plans To Attack India : దిల్లీలోని రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు.

Pak Terrorist Plans To Attack India
Pak Terrorist Plans To Attack India

Pak Terrorist Plans To Attack India : దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమావేశాలకు సర్వం సిద్ధమైన వేళ.. షాకింగ్​ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్రమత్తమై రక్షణ చర్యలను పటిష్ఠం చేశారు.

బిహార్​కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్​కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) డిటెక్టివ్‌లు.. బిహార్​కు వెళ్లి అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. దిల్లీ, కోల్​కతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన చిత్రాలను తీసి అతడి పాకిస్థాన్​కు పంపినట్లు గుర్తించారు.

పాక్​ మహిళకు..
Pakistan Spy Bihar : బిహార్​లోని బన్సీ ఝా ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్​టీఎఫ్​ డిటెక్టివ్​లు.. అనేక చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి కోల్‌కతాకు వచ్చి బాలి వంతెనతో పాటు అక్కడే ఉన్న మరో ఆలయానికి చెందిన చిత్రాలను పాకిస్థాన్‌లోని ఓ మహిళకు పంపినట్లు డిటెక్టివ్‌లు ఆరోపించారు. ఆ మహిళ.. పాకిస్థాన్​ ఇంటిలిజెన్స్​లో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.

ఆగస్టు 29వ తేదీ ఉదయాన్నే..
మరోవైపు, కోల్​కతా పోలీసులతో దిల్లీ పోలీసులు.. సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే బన్సీ ఝాను తమ కస్టడీలో తీసుకోవాలని దిల్లీ పోలీసులు భావిస్తున్నారని సమాచారం. ఆగస్టు 29న ఉదయం బిహార్​లోని బన్సీ ఝాను ఎస్​టీఎఫ్​ అరెస్ట్​ చేసిందని వివిధ వర్గాలు తెలిపాయి.

ఆ ఉగ్రసంస్థ పనే!
Pakistan Terrorism Plans : అయితే కోల్​కతాతో సహా వివిధ నగరాలకు సంబంధించిన ఫొటోలను అతడి దగ్గర గుర్తించినట్లు ఓ అధికారి తెలిపారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​తో పాటు నేషనల్​ వార్​ మెమోరియల్​ చిత్రాలు కూడా ఉన్నట్లు చెప్పారు. దేశంలో పలు ముఖ్యమైన ప్రదేశాలను.. ఐసిస్​ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.

బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్!
Bangalore Terrorist Plan : కొన్నినెలల క్రితం, భారీ ఉగ్ర కుట్రను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. బెంగళూరులో పేలుళ్లకు పథకం రచించిన ఐదుగురు అనుమానిత ముష్కరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదాసిర్, జాహిద్​లుగా గుర్తించారు. 2017 నాటి ఓ హత్య కేసులో వీరంతా నిందితులని, పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉగ్రవాదులతో ఏర్పడిన పరిచయంతో పేలుళ్లకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్చేయండి.

Islamic Radicals Case : ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు.. భారీ పేలుళ్లకు ప్లానింగ్

పక్కా ప్లాన్​తోనే ట్రైన్​లో ప్రయాణికుడికి నిప్పు! ఉగ్రవాది పనేనా? అతడి కోసం పోలీసుల వేట

Last Updated :Sep 7, 2023, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.