ETV Bharat / bharat

కరోనా టీకా రెండో డోసు ఎగ్గొట్టిన వారు 3.86 కోట్లు!

author img

By

Published : Aug 19, 2021, 6:57 PM IST

Updated : Aug 19, 2021, 7:07 PM IST

COVID SECOND DOSE
కరోనా టీకా

కరోనా టీకా తొలి డోసు తీసుకున్న నిర్ణీత గడువులోగా రెండో డోసు తీసుకోనివారి లెక్కలను కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు కలిపి అలాంటివారు 3.86కోట్ల మందికి పైగా ఉన్నారని తెలిపింది.

దేశంలో 3.86కోట్ల మందికి పైగా నిర్ణీత సమయంలోగా రెండో డోసు కరోనా టీకా తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రమణ్ శర్మ అనే కార్యకర్త.. ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చింది. నిర్ణీత సమయంలో కొవిషీల్డ్​ రెండో డోసు తీసుకోనివారు 3,40,72,993 మంది ఉండగా, కొవాగ్జిన్ రెండో డోసు వేయించుకోనివారు 46,78,406 మంది ఉన్నట్లు తెలిపింది.

కాగా, కొవిన్ పోర్టల్​లోని సమాచారం ప్రకారం గురువారం మధ్యాహ్నాం నాటికి 44,22,85,854 మంది తొలి డోసు, 12,59,07,443 మంది రెండో డోసు వేయించుకున్నారు. ఇక కొవిషీల్డ్​ తీసుకున్న 84-112 రోజుల తర్వాత, కొవాగ్జిన్ వేయించుకున్న 28-42 రోజుల అనంతరం రెండో డోసు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

తొలి డోసు తీసుకున్న నిర్ణీయ సమయంలోగా రెండో డోసు తీసుకోవాలని సిఫార్సు చేసింది కేంద్రం. రెండు డోసులు ఒకే టీకాకు చెందినవై ఉండాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్​!

Last Updated :Aug 19, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.