ETV Bharat / bharat

అన్నదమ్ములిద్దరూ బావి గోడపై కూర్చొని.. అంతలోనే..

author img

By

Published : Nov 9, 2021, 12:29 PM IST

అన్నదమ్ములిద్దరూ అకస్మాత్తుగా బావిలో పడి (brothers fell in well) మృతి చెందారు. బావి గోడపై కూర్చొని సరదాగా మచ్చటిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఒడిశా సంబల్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

boys fell in well
అకస్మాత్తుగా బావిలో పడి అన్నదమ్ములు మృతి

అకస్మాత్తుగా బావిలో పడి అన్నదమ్ములు మృతి

ఒడిశా సంబల్​పుర్​లో దారుణం జరిగింది. అన్నదమ్ములిద్దరూ అకస్మాత్తుగా బావిలో పడి (brothers fell in well) మృతి చెందారు. బావి గోడపై కూర్చొని సరదాగా మచ్చటిస్తుండగా ఈ ఘటన జరిగింది.

సంబల్​పుర్​ సాహూ కాలనీలో నివసిస్తున్న సునీల్ త్రిపాఠీ, సుశీల్ త్రిపాఠీ అన్నదమ్ములు. సోమవారం రాత్రి ఇద్దరూ ఇంటి ప్రాంగణంలోని బావి గోడపై కూర్చొని ఎదురుగా ఉన్న మరో వ్యక్తితో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు పట్టు కోల్పోయి.. సోదరున్ని కూడా వెనుకకు లాగాడు. దీంతో ఇద్దరూ బావిలో పడిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. బావి నుంచి తీసి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ఉద్యోగం ఆశ చూపి మహిళపై అత్యాచారం.. మద్యం తాగించి మరీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.