ETV Bharat / bharat

Nursing Student Murder in Vikarabad : కన్ను పీకేసి, గొంతు కోసి.. నర్సింగ్​ విద్యార్థిని దారుణ హత్య

author img

By

Published : Jun 11, 2023, 6:33 PM IST

Updated : Jun 11, 2023, 6:53 PM IST

nursing student murder case
nursing student murder case

Nursing Student Murder in Parigi : రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో అప్సర హత్యోదంతం మరువక ముందే.. వికారాబాద్‌ జిల్లాలో అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కన్ను పీకేసిన దుండగులు.. కాళ్లు, చేతులను కత్తులతో కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ కుంటలో పడేశారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Nursing Student Brutal Murder in Vikarabad : వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కాడ్లాపూర్‌ గ్రామంలో నిన్న అదృశ్యమైన యువతి.. తెల్లారేలోగా దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన జంగయ్య, యాదమ్మ దంపతుల కుమార్తె శిరీష.. పారామెడికల్‌ చదువుతోంది. తల్లి యాదమ్మకు ఇటీవల గుండెపోటు రావటంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి శిరీష కనిపించకుండా పోయింది.

కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే ఉదయం కాడ్లాపూర్‌ శివారులోని ఓ కుంటలో గుర్తు తెలియని శవం కనిపించింది. గమనించిన గ్రామస్థులు శిరీషనే హత్యకు గురైనట్లు గుర్తించారు. ఓ కన్ను పీకేసి.. కాళ్లు, చేతులను కత్తులతో కోసి, పాశవికంగా యువతిని హత మార్చారు. అనంతరం మృతదేహాన్ని కుంటలో పడేసి వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కుంట వద్ద ఆధారాలు సేకరించారు.

"మా కుమార్తె రాత్రి ఇంటి నుంచి వెళ్లింది. ఆ తరువాత తిరిగి ఇంటికి రాలేదు. తెలిసిన వారు, బంధువులను అడిగాం. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇంతలో మా ఊరు చివర ఉన్న చిన్న కుంటలో శవమై కనిపించింది. శవంపై కళ్లు పొడిచి ఉన్నాయి. మెడ, శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయి". - జగ్గయ్య, శిరీష తండ్రి

Nursing Student Murder in Parigi : శరీర భాగాలను కోసివేసినట్లు గుర్తించారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతి ఫోన్‌కాల్‌ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. చివరగా శిరీషతో ఫోన్‌లో మాట్లాడిందెవరు..? ఇంట్లోనే ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

"కాడ్లాపూర్‌​ శివారులోని ఓ నీటి కుంటలో యువతి మృతదేహాం దొరికినట్లు మాకు సమాచారం వచ్చింది. ఆ మృతదేహం కాడ్లాపూర్​కు చెందిన యువతి శిరీషగా గుర్తించాం. గ్రామస్థుల సహకారంతో యువతి మృతదేహాన్ని బయటకు తీశాం. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. శిరీష వయుస్సు 19 సంవత్సరాలు ఉంటుంది. ఆమె తండ్రి చెప్పిన దాని ప్రకారం నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో యువతి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నాం. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాం."- పోలీసులు

కన్ను పీకేసి, గొంతును కత్తులతో కోసి నర్సింగ్​ విద్యార్ధిని దారుణ హత్య

ఇవీ చదవండి:

Last Updated :Jun 11, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.