అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిందితుడు, పోలీసు అధికారి సచిన్ వాజేను అరెస్టు చేసిన విధానం సరైనది కాదని మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నేతలు ఆరోపించారు. వాజేను అరెస్టు చేయడం అధికార శివసేన కూటమిని అవమానించడమని అన్నారు. ఈ మేరకు మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు.
పేలుడు పదార్థాలు ఉన్న వాహనానికి సంబంధించిన యజమాని మన్సుఖ్ హిరేన్ మృతి నేపథ్యంలో ఎన్ఐఏ శనివారం వాజేను అరెస్టు చేసింది. హిరేన్ భార్య కూడా తన భర్త మరణానికి కారణం వాజే అని ఆరోపించారు.
అయితే, వాజే.. శివసేన అభ్యర్థి అంటూ భాజపా చేసిన అరోపణలను తిప్పికొట్టారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. 2008లోనే పార్టీలో ఆయన సభ్యత్వం తొలగించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: