ETV Bharat / bharat

డ్రగ్స్ ​కేసుపై మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు

author img

By

Published : Oct 9, 2021, 2:43 PM IST

curise ship drugs case
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రోద్బలంతో ఎన్​సీబీ అధికారులు విడుదల చేశారని చెప్పారు.

ముంబయిలో సంచలనం సృష్టించిన క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్ కేసు చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటోంది. షారుఖ్‌ తనయుడు అరెస్టైన ఈ కేసులో ముగ్గురిని ఓ భాజపా నాయకుడి ప్రొద్బలంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) అధికారులు తప్పించారని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. ఈ మేరకు కొన్ని వీడియోలను మంత్రి విడుదల చేశారు.

క్రూయిజ్‌ షిప్‌పై దాడి అనంతరం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత ఎన్​సీబీ అధికారులు వెల్లడించారని నవాబ్ మాలిక్​ గుర్తుచేశారు. కానీ, వారిలో 8 మందిని మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. రిషభ్‌ సత్యదేవ్, ప్రతిక్‌ గాబా, అమిర్‌ ఫర్నిచర్‌వాలాను ఓ భాజపా నాయకుడితో మాట్లాడిన అనంతరం ఎన్​సీబీ అధికారులు విడుదల చేశారని మంత్రి ఆరోపించారు. ఆ ముగ్గురిని ఎవరి ఆదేశాల మేరకు డ్రగ్స్‌ కేసు నుంచి తప్పించారో ఎన్​సీబీ తెలపాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.