ETV Bharat / bharat

MP Prajwal Revanna Election Declared Null : జేడీఎస్​కు షాక్​.. ఎంపీ రేవణ్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 3:58 PM IST

Updated : Sep 1, 2023, 5:34 PM IST

MP Prajwal Revanna Disqualified
MP Prajwal Revanna Disqualified

MP Prajwal Revanna Election Declared Null : జేడీఎస్​ తరఫున గెలిచిన ఏకైక ఎంపీ, అధినేత దేవెగౌడ మనవడు ప్రజ్వల్​ రేవణ్నకు షాక్ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది కర్ణాటక హైకోర్టు. ఎన్నికల అఫిడవిట్​లో​ తప్పుడు సమాచారం సమర్పించారనే కేసులో ఈ నిర్ణయం తీసుకుంది.

MP Prajwal Revanna Election Declared Null : జేడీఎస్​ ఎంపీ ప్రజ్వల్​ రేవణ్నకు రాజకీయంగా గట్టి షాక్ తగిలింది. హసన్​ ఎంపీగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది కర్ణాటక హైకోర్టు. ఎన్నికల అఫిడవిట్​లో​ తప్పుడు సమాచారం సమర్పించారనే కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఎన్నికల నియమావళి కోడ్​ 19 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్​కు సూచించింది. వీరితో పాటు ఆయన తండ్రి హెచ్​డీ రేవణ్న, సోదరుడు సూరజ్ రేవణ్నపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నియోజకవర్గానికి చెందిన జి. దేవరాజగౌడ అనే ఓటర్​తో పాటు రేవణ్నపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎ. మంజు పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన జస్టిస్ నటరాజ్​ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. శుక్రవారం​ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని తేలిన నేపథ్యంలో తనను ఎంపీగా గుర్తించాలని బీజేపీ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్​ను ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్​ మంజు సైతం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్​ను ఆదేశించింది.

2019 Hassan MP Election Result : అంతకుముందు 2019 ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎ.మంజు.. ప్రజ్వల్​ రేవణ్నపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి గెలిచారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు ఆదాయాన్ని చూపించారని.. దాదాపు రూ. 23 కోట్ల ఆస్తులను ఇన్​కం ట్యాక్స్​ లెక్కల్లో చూపించలేదని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎ. మంజు జేడీఎస్​ నుంచి అరకలగుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎ. మంజుపై 1,41,224 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ప్రజ్వల్ రేవణ్న. మంజుకు 5,35,382 ఓట్లు రాగా.. జేడీఎస్​ అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్నకు 6,76,606 ఓట్లు వచ్చాయి. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జేడీఎస్​ నుంచి ఎంపీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ప్రజ్వల్ రేవణ్న మాత్రమే. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడ.. తన సిట్టింగ్ స్థానమైన హసన్​ను మనవడు ప్రజ్వల్ రేవణ్నకు అప్పగించారు.

తాతయ్య కోసం మనుమడి రాజీనామా!

కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి.. రెబల్​గా పోటీకి సై!.. కుమారస్వామి తగ్గేదేలే!

Last Updated :Sep 1, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.