ETV Bharat / bharat

బావను కొట్టి చంపిన బామ్మర్ది- తరచూ ఇంటికి వస్తున్నాడని...

author img

By

Published : Nov 3, 2021, 12:25 PM IST

Updated : Nov 3, 2021, 1:00 PM IST

brother in law killed
క్రైమ్​ న్యూస్​

తరచూ ఇంటికి వస్తున్నాడని సొంత బావనే హత్య చేశాడు (crime news latest updates) ఓ యువకుడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లోని బైతూల్ జిల్లాలో జరిగింది.

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. ఇంటికి తరచూ (crime news latest updates) వస్తున్నాడని బావనే హత్య చేశాడో యువకుడు. ఈ ఘటన బైతూల్ జిల్లా, బిచుయా గ్రామంలో జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని హిరవాడి గ్రామానికి చెందిన వినోద్​ పండ్రే(32).. దీపక్ కుమార్​(25) సోదరిని వివాహం చేసుకున్నాడు. దీపక్​ తల్లిదండ్రులతో పాటే నివసిస్తాడు. పెళ్లి అనంతరం సోదరి భర్తతో కలిసి తరచూ పుట్టింటికి వస్తుండేది. ఇది దీపక్​కు నచ్చలేదు. తన ఇంటికి రాకూడదంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవల సోదరి, బావ ఇంటికి రావడంపై గొడవకు దిగాడు దీపక్. ఈ ఘర్షణలో పండ్రేను కర్రతో బాది చంపేశాడు దీపక్. మధ్యలో కల్పించుకున్న అతని తల్లిని కూడా తీవ్రంగా గాయపరిచాడని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:దిల్లీలో రూ.18 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

Last Updated :Nov 3, 2021, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.