ETV Bharat / bharat

మరణించిన ఉద్యోగిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

author img

By

Published : Sep 3, 2021, 7:39 PM IST

Updated : Sep 3, 2021, 7:53 PM IST

transfer
చనిపోయిన ఉద్యోగిని బదిలీ చేస్తు గవర్నమెంట్​ ఆర్డర్​!

చనిపోయిన ఓ ఉద్యోగిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడమే బదిలీకి కారణమని ఆదేశాల్లో చెప్పడం గమనార్హం.

మరణించిన ఓ ఉద్యోగిని బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చి మధ్యప్రదేశ్​ ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్​ జాట్​ను రాజ్​గఢ్​ మున్సిపల్​ కౌన్సిల్​కు బదిలీ చేస్తున్నట్టు ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేసింది.

ఏం జరిగిందంటే..

రూ. 3వేల లంచం తీసుకున్నట్టు ఫిర్యాదు అందడం వల్ల బియోరాలో విధులు నిర్వహిస్తున్న సంజయ్​ జాట్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడిపై భగీరథ్​ జాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అది జరిగిన కొద్ది రోజుల నుంచి గిరిరాజ్​, కాసేరా, రజత్​ కాసేరాతో పాటు జర్నిలిస్ట్​ ఇస్తాయక్​ నబీలు సంజయ్​ను బెదిరించడం మొదలపెట్టారు. ఒత్తిడి తట్టుకోలేక గత నెల 14న సంజయ్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

MP Government issues transfer order of a dead man
బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

సంజయ్​ మరణించిన 16రోజుల తర్వాత అతడిని బదిలీ చేస్తూ పట్టణ, గృహశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండమే ఇందుకు కారణమని చెప్పడం గమనార్హం.

మరోవైపు సంజయ్​ ఆత్మహత్య కేసులో.. నిందితులు గిరిరాజ్​ కాసేరా, రజత్​ కాసేరాలను పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టు ఇషాతయక్​ నబీ, భగీరథ్​ జాదవ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : సీఎం పోలికలతో దుర్గామాత విగ్రహం.. ఎక్కడంటే?

Last Updated :Sep 3, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.