ETV Bharat / bharat

రైలు​ కిందపడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

author img

By

Published : Jan 26, 2022, 8:13 PM IST

బిహార్​లోని బక్సర్​ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి రైలు​ కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.

suicide
ట్రైన్​ కిందపడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బిహార్​లోని బక్సర్​ జిల్లాలో జరిగింది.

దుమ్రావ్​ స్టేషన్​ సమీపంలో జరిగిన ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు బక్సర్​ జీఆర్​పీ స్టేషన్​ ఎస్సై రామాశిశ్​ ప్రసాద్​ తెలిపారు. మృతుల్లో ఆరు నెలల పసికందు సైతం ఉన్నట్లు చెప్పారు. అయితే.. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల్లో ఐదుగురు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.