ETV Bharat / bharat

రూ.500.. 100కిలోమీటర్లు.. పంపిన నాలుగేళ్లకు చేరిన మనీ ఆర్డర్​

author img

By

Published : Dec 2, 2022, 11:16 AM IST

Money order to sister takes 4 years to reach 100 km in Odisha
రూర్కెలా తపాలా కార్యాలయం

ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం తన చెల్లెలకు చేసిన మనీ ఆర్డర్ ఇప్పటికి ఆమె వద్దకు చేరింది. ఇందులో విచిత్రం ఏంటంటే 100 కిలోమీటర్ల దూరానికి మనీ ఆర్డర్ చేరేందుకు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇందుకు కారణం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఒడిశాలో నాలుగేళ్ల కిందట పంపిన మనీ ఆర్డర్ ఇప్పటికి గమ్య స్థానానికి చేరింది. రవుర్కెలా నగరంలో ప్రమోద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రమోద్ సోదరి సుమిత్రకు వివాహమై, తన కుటుంబంతో టెన్సాలో నివసిస్తోంది. ప్రమోద్ తన సోదరికి, సావిత్రి వ్రతం నిమిత్తం రూ.500ను పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా పంపించాడు. అయితే ఆయన పంపించిన నగదు తన చెల్లెలి దగ్గరకు చేరిందనే అనుకున్నాడు. చెల్లెలు కూడా ఏదో సమస్య కారణంగా అన్నయ్య డబ్బులు పంపించలేదేమో అనుకుంది.
అనూహ్యంగా.. నాలుగేళ్ల క్రితం చేసిన మనీ ఆర్డర్.. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమోద్ సోదరికి ఈ ఏడాది నవంబరు 26న చేరింది. 2018లో పంపిన మనీ ఆర్డర్ 2022లో చేరటానికి కారణాలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Money order to sister takes 4 years to reach 100 km in Odisha
మనీ ఆర్డర్

ఈ విషయంపై బాధితుడు ప్రమోద్, అతడి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. "ఈ వ్యవహారంపై పోస్టల్ ఎస్​పీ స్పందన కోసం ఆయనకు కలవడానికి ప్రయత్నంచాం. అయితే ఏదో కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంబల్​పుర్ వెళ్లారు. దీంతో ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించాం. ఈ విషయమై ఎవరూ ఇంతవరకు ఫిర్యాదు చేయని కారణంగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మీడియా నుంచి వచ్చిన వార్తల ఆధారంగా, ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని పోస్టల్ ఎస్​పీ అన్నారు" అని తెలిపారు.

money-order-to-sister-takes-4-years-to-reach-100-km-in-odisha
ప్రమోద్ సోదరి సుమిత్ర
Money order to sister takes 4 years to reach 100 km in Odisha
బాధితుని తరపు న్యాయవాది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.